సరైన కుర్చీ వేయకపోవడంతో..
రోహిత్కు వేసిన చైర్.. ముందు టేబుల్ మీద ఉన్న మైకుల కంటే తక్కువ ఎత్తులో ఉంది. అది అంత సౌకర్యంగా లేకపోవడంతో హెచ్సీఏ ప్రతినిధులు మళ్లీ మరో చైర్ తెప్పించారు. అది కూడా అంతే ఉండటంతో రోహిత్ చిర్రెత్తుకుపోయాడు. నిర్వహాకులపై 'క్యా యార్'(ఎందిరా ఈ లొల్లి) అని కస్సుమన్నాడు. హెచ్సీఏ గురించి ముందే తెలుసు గనుక ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి మీడియా సమావేశాన్ని ముగించాడు. ఈ విషయంపై డెక్కన్ క్రానికల్ ఓ కథనం ప్రచురించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దాంతో హెచ్సీఏపై హిట్ మ్యాన్ అభిమానులు మండిపడుతున్నారు.

తొక్కిసలాటతో నవ్వుల పాలు..
మ్యాచ్ నిర్వహణలో భాగంగా జింఖానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల విషయంలో హెచ్సీఏ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. అభిమానులను అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడంతో హెచ్సీఏ నవ్వులపాలైంది. అంతేకాకుండా మైదానంలోని కుర్చీలపై కూడా తీవ్ర ట్రోలింగ్ జరిగింది. కుర్చీల మీద పక్షులు మల విసర్జన, విరిగిపోయి, పాడైపోయి ఉన్న చైర్స్ ఫోటోలు వైరలయ్యాయి. అయితే మ్యాచ్ సమయానికల్లా 'మమ' అనిపించి చేతులు దులుపుకున్న హెచ్సీఏ.. రోహిత్ మీడియా సమావేశంలో మాత్రం దొరికిపోయింది.

అధికార పార్టీ నాయకులకు అప్పనంగా టికెట్లు..
ఇక టికెట్ల కోసం అభిమానులు యుద్దమే చేయగా.. రాజకీయ నాయకులు మాత్రం అప్పనంగా టికెట్లు కొట్టేసారు. తమ అధికారంతో కాంప్లిమెంటరీ పాసులు తెచ్చుకున్నారు. చోటా మోటా నాయకులు సైతం వీఐపీ పాస్లతో మ్యాచ్ను వీక్షించారు. మంత్రులు సైతం తమ అనుచర గణంతో మ్యాచ్కు హాజరయ్యారు.
దాదాపు నగరంలోని అధికారిక కార్పోరేటర్లు, చోటా మోటా నాయకులకు కాంప్లిమెంటరీ పాసులు అందినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మ్యాచ్కెళ్లామని వారు పెట్టిన ఫోటోలో ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్సీఏ వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు..
ఉప్పల్ మ్యాచ్కు ముందు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో హెచ్సీఏ క్లబ్ మెంబర్స్కు 'మందు పార్టీ' ఇచ్చాడు. ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అధ్యక్ష పీఠమెక్కడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగానే హెచ్సీఏ కార్యదర్శులకు ఏకంగా రూ. 30 లక్షలు ఖర్చు చేసి మందు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆహ్వన పత్రికలు పంపి మరీ మందు పార్టీకి రావాలని క్లబ్ మెంబర్స్ను కోరాడు. మళ్లీ అధ్యక్ష పదవి అందుకోవాలనే ఆశతోనే అజార్ 12 వేల టికెట్లు పక్కదారి పట్టించి బ్లాక్లో అమ్మాడని కొందరు క్లబ్ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications












