పుణే: ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ.. అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లలో చూడచక్కని షాట్లతో పరుగులు పిండుకున్న రియాన్ పరాగ్ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. సిక్సర్ బాదిన ఆనందంలో ఏదో అన్న రియాన్ పరాగ్తో ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ వాగ్వాదానికి దిగాడు.
Harshal vs riyan parag fight#RCBvsRR #parag #HarshalPatel #IPL20222 pic.twitter.com/Xotv4DGF8T
— John cage (@john18376) April 26, 2022
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్స్లు, ఫోర్తో 18 పరుగులు పిండుకున్నాడు. రియాన్ పరాగ్ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.