న్యూఢిల్లీ: భారత మహిళా సీనియర్ క్రికెటర్, హైదరాబాద్ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ను టీ20 వరల్డ్కప్ మ్యాచ్ నుంచి తప్పించడం వెనుక చాలా పెద్దోళ్లు కుట్ర చేశారని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వెల్లడించింది. అయితే వాళ్ల పేర్లను మాత్రం బయటపెట్టలేనని స్పష్టం చేసింది. 2018 టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీస్ నుంచి మిథాలీని తప్పించారు. అయితే ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో పెద్ద దుమారమే రేగింది.
'మిథాలీని తప్పించాలని చాలా మంది ప్రణాళికలు రచించారు. వాళ్ల పేర్లు చెప్పినా ప్రయోజనం లేదు. టీమ్ ఓ స్థాయికి చేరినప్పుడు ఇలాంటి వివాదాలు సహజం. మిథాలీ నా కంటే చాలా సీనియర్. ఆమె ఆడిన దాంట్లో సగం క్రికెట్ కూడా ఆడలేదు. తనకు నాకు అసలు పోలికే లేదు. సరైన వసతులు లేని టైమ్లో కెరీర్ ప్రారంభించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. అన్ని సమకూరాక నేను ఆట మొదలుపెట్టా. టీమ్ను ముక్కలు చేసే విధంగా మేమిద్దరం ఎప్పుడూ ప్రయత్నించలేదు. సోషల్ మీడియాలో నేను అంత యాక్టివ్ కాదు.'అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది.
అతన్ని చూసి గజ్జున వణికేవాడిని.. దాక్కొని తినేవాడిని: కపిల్ దేవ్