ఉప్పు-నిప్పుగా..
ఇక భజ్జీ- సైమండ్స్ ఆడే రోజుల్లో ఈ ఇద్దరూ ఉప్పు-నిప్పుగా ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య పోరును అభిమానులు కూడా ఆస్వాదించేవారు. 2008లో ఈ ఇద్దరి కారణంగా చోటు చేసుకున్న మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలోనే ఓ మచ్చగా నిలిచిపోయింది. ఈ వివాదాన్ని అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. 2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది.

మంకీ గేట్ వివాదం..
దీంతో రిఫరీ హర్భజన్పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు.

కెరీర్ నాశనమైంది..
తన కెరీర్ను 'మంకీ గేట్' వివాదమే నాశనం చేసిందని ఓ సందర్భంలో సైమండ్స్ తెలిపాడు. అప్పట్లో భజ్జీ తనను మంకీ అంటూ గెలీ చేశాడని చెప్పాడు. మంకీ గేట్ వివాదం జాతి వివక్ష వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చాడు. అయితే తమ జట్టు అనవసరంగా ఈ విషయాన్ని పెద్దదిగా చేసిందని అన్నాడు. ఆ వివాదం తర్వాతే తాను ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెట్టానని చెప్పిన సైమండ్స్... మంకీ గేట్ వివాదం నుంచి తాను కోలుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం సైమండ్స్, భజ్జీ కెరీర్లో చేదు అనుభవంగా మిగిలిపోయింది.


Click it and Unblock the Notifications












