
ఓపెనర్గా కోహ్లీ..
ఈ క్రమంలోనే ఓ చానెల్తో మాట్లాడిన గ్రేమ్ స్వాన్.. కోహ్లీ తుది జట్టులోకి వస్తే ఇషాన్కు బదులు ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. 'కోహ్లీ లాంటి మేటి ఆటగాడిని మూడో స్థానంలో ఆడించొద్దు. ఎందుకంటే అతడు మధ్య ఓవర్లలో సూర్యకుమార్, దీపక్ హుడాలా అంత ప్రభావవంతంగా ఆడలేకపోతున్నాడు. ఒకవైపు రోహిత్ అద్భుతంగా ఆడుతుంటే.. మరోవైపు కోహ్లీ అతడిని అనుసరిస్తాడు. వాళ్లిద్దరూ ఓపెనింగ్ చేస్తే మంచి పరుగులు సాధిస్తారు. తర్వాత ఎలాగూ సూర్య, దీపక్ అద్భుతంగా ఆడతారు' అని స్వాన్ పేర్కొన్నాడు.

బీ టీమ్ పంపించాలి..
అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా గెలవాలంటే ఆస్ట్రేలియాకు 'బీ' టీమ్ను పంపించాలని సెటైర్లు పేల్చాడు. గురువారం ఇంగ్లాండ్తో తలపడిన మ్యాచ్లో టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే తొలి మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చిన విరాట్ కోహ్లీ, పంత్, బుమ్రా వంటి ఆటగాళ్లను రెండో మ్యాచ్లో తుది జట్టులోకి తీసుకుంటే అది ఇంగ్లాండ్కు కలిసివస్తుందని చెప్పాడు.

సీనియర్లు వస్తే ఓటమి..
'రెండో మ్యాచ్లో ఈ కీలక ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంటే అది ఇంగ్లండ్కే ప్రయోజనం. టీమిండియా అదే పనిచేయాలని నేను ఆశిస్తున్నా. అలా చేస్తే ఇంగ్లండ్ గెలవొచ్చు. ఎందుకంటే తొలి మ్యాచ్లో ఆడించిన ఆటగాళ్లనే రెండో మ్యాచ్లోనూ ఆడిస్తే అప్పుడు ఇంగ్లండ్ మళ్లీ ఓడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పంత్, కోహ్లీ, బుమ్రా వంటి వారిని తుది జట్టులోకి తీసుకొంటే అది ప్రస్తుత జట్టు లయను దెబ్బతీస్తుంది' అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












