భారత్ విజయంతో దివాళీ..
చివరకు గూగుల్ సీఈవో సుదర్ పిచాయ్ కూడా ఈ మ్యాచ్ను ఆస్వాదించానని ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ సాధించిన విజయంతోనే తన దీవాళీ సంబరాలు మొదలయ్యాయని ట్వీట్ చేశాడు.'హ్యపీ దివాళీ. ఈ గొప్ప సమయాన్ని అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మ్యాచ్ చివరి మూడు ఓవర్లు మరోసారి చూడటం ద్వారా నేను దీపావళి సంబరాలు చేసుకున్నాను. అద్భుతమైన ఆట, అద్భుతమైన ప్రదర్శన'అని సుందర్ పిచాయ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022 అనే హ్యాష్ ట్యాగ్లను జత చేశారు.
పాక్ నెటిజన్ ఎటకారం..
ఈ ట్వీట్ను చూసి సహించలేకపోయిన ముహమ్మద్ షహ్జైబ్ అనే పాకిస్థాన్ నెటిజన్.. 'మీరు తొలి మూడు ఓవర్లు కూడా చూడాల్సింది'అని ఎటకారంగా బదులిచ్చాడు. తొలి మూడు ఓవర్లలో పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా.. రాహుల్ 4 పరుగులకే ఔటయ్యాడు. దీన్ని ఉద్దేశించే సదరు పాకిస్థానీ అలా ట్వీట్ చేశాడు. అతని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న సుందర్ పిచాయ్.. అది కూడా చేశాను. భువీ, అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ భారత బౌలర్లను ప్రశంసించాడు.

గూగుల్ సీఈవోనా.. మజాకా?
నేను చెప్పింది టీమిండియా ఇన్నింగ్స్ అంటూ షహ్జైబ్ బదులిచ్చినా.. గూగుల్ సీఈవో బదులివ్వలేదు. ఇక సుందర్ పిచాయ్ కౌంటర్కు భారత నెటిజన్లు ఫిదా అయ్యారు. ట్రోలర్స్కే అమ్మ మొగుడిలా ఉన్నాడని సంతోషం వ్యక్తం చేశారు. సుందర్ పిచాయ్ సమయస్ఫూర్తిని కొందరు పొగడగా.. మరి కొందరు మాత్రం.. అంతటి గొప్ప వ్యక్తి నిన్ను ట్రోల్ చేశాడు. ఆయన రిప్లయ్ ఇచ్చిన ట్వీట్ను స్క్రీన్ షాట్ తీసి లామినేట్ చేయించి నీ లివింగ్ రూమ్లో ఉంచుకో. అది కోట్లాది రూపాయలు విలువ చేసే పెయింటింగ్ లాంటిది. ఇంకా ఏడవటం ఆపేయ్.. గూగుల్ సీఈవో నీకు రిప్లయ్ ఇచ్చాడు భయ్యా.. అంటూ మరికొందరు పాకిస్థానీకి సూచిస్తున్నారు. ప్రస్తుతం సుందర్ పిచాయ్ కౌంటర్కు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications












