రిషభ్ పంత్ విషయంలో మాత్రం ఇంకా ఆందోళనగానే
వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయంలో మాత్రం ఇంకా ఆందోళనగానే ఉంది. బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయిన పంత్.. అటు కీపింగ్లో కూడా మెప్పించలేకపోతున్నాడు. తొలి టీ20లో డీఆర్ఎస్ విషయంలో రోహిత్ శర్మను బోల్తా కొట్టించగా.. రెండో టీ20లో అత్యుత్సాహం ప్రదర్శించి బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ను స్టంపౌట్ నుంచి కాపాడాడు.

పంత్ తొందరపాటు వల్ల
తన తొందరపాటు వల్ల అభిమానులతో పాటు జట్టు సభ్యులను కలవర పెట్టాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వేసిన మూడో బంతిని లిటన్ దాస్ క్రీజు వదిలి ముందుకువచ్చి ఆడాలని ప్రయత్నించాడు. పంత్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో లిటన్ పెవిలియన్ బాటపట్టాడు.
బుల్లెట్ కంటే వేగంగా వికెట్లను గిరాటేసిన మిచెల్ స్టార్క్ ఇన్ స్వింగర్ (వీడియో)

నాటౌట్గా ప్రకటించిన థర్డ్ అంఫైర్
అయితే ఆ బంతిని చెక్ చేసిన థర్డ్అంపైర్.. నాటౌట్గా ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఐసీసీ 40.3 నిబంధన ప్రకారం.. బ్యాట్స్మన్ శరీరం లేదా బ్యాట్కు తాకని బంతి వికెట్లను దాటి వచ్చిన తర్వాతే కీపర్ అందుకుని స్టంప్ చేయాలి. కీపర్ గ్లౌజ్లోని ఏ భాగమైనా వికెట్కంటే ముందు ఉంటే.. అది నోబాల్ కిందే లెక్క.

నాగ్ పూర్ వేదికగా వేదికగా ఆఖరి టీ20
ఇక్కడ బంతిని పంత్ వికెట్లకు కాస్త ముందుగానే అందుకుని స్టంప్ చేశాడు. అది నోబాల్ అవ్వడంతో థర్డ్అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. కాగా, మూడు టీ20ల సిరిస్లో భాగంగా రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరగనుంది.


Click it and Unblock the Notifications
