ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో అందరి కన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ఆ జట్టు ఎలిమినేటర్కే పరిమితమైంది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో హోరాహోరీగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 80), వాషింగ్టన్ సుందర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 48) పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో జస్ప్రీత్ బుమ్రా(1/27) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్ ఓటమిని శాసించాడు.

ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు లేకపోవడం.. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. అయితే ఈ 24 పరుగుల్లో 22 రన్స్ను హార్దిక్ పాండ్యా తమ ఆఖరి ఓవర్లో సాధించడం గమనార్హం. ముంబై ఇండియన్స్ సందర్భంగా గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు భారీ సిక్స్లతో ఈ పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ను కోయిట్జీ కట్టుదిట్టంగా వేసి 12 పరుగులకే పరిమితం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
బుమ్రా వల్ల ముంబై ఇండియన్స్ గెలిచినా.. గెరాల్డ్ కోయిట్జీ చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైంది. పేలవ బౌలింగే కాకుండా 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను కూడా కోయిట్జీ వదిలేసాడు. ఈ అవకాశం అందుకున్న రోహిత్ శర్మ ఏకంగా 81 పరుగులు చేశాడు. కోయిట్జీ ఈ క్యాచ్ పట్టినా.. ఆఖరి ఓవర్ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా గుజరాత్ టైటాన్స్ సునాయసంగా విజయం సాధించేది. కోయిట్జీ పేలవ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్కు కట్టప్పలా మారి వెన్నుపోటు పొడిచాడు.