ఆర్సీబీకి నిరాశే..
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. కనీసం ఈ సీజన్లోనైనా మ్యాక్సీ రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు 'ఆర్సీబీ మ్యాక్స్వెల్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. కానీ మ్యాక్స్వెల్ వారికి నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్లో పంజాబ్ తరపున 13 మ్యాచ్లు ఆడి 108 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగ. అతని వల్ల ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోనుంది.
నిజానికి ఏ ఐపీఎల్ సీజన్లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు. ప్రతీ సీజన్లో అతను విఫలమవుతున్నాడు. వాస్తవానికి అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడు. అతను బాగా ఆడి ఉంటే ఇన్ని ఫ్రాంచైజీలు మారే వాడు కాదు. ఒక్క 2014 సిజన్ మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడు చూడలేదు.
కోట్లు కుమ్మరించినా..
అతను ఆసీస్ జట్టుతో పాటు అక్కడి లీగ్ల్లో మాత్రమే ఆడుతాడు తప్ప ఐపీఎల్లో అతనిపై కోట్ల వర్షం కురిపించినా ఆడడు. ఈ విషయం తెలియక మ్యాక్సీని ఆర్సీబీ వేలంలో రూ. 14.25 కోట్లు పెట్టి తీసుకుంది. మ్యాక్సీ తరహాలోనే విధ్వంసకర ఆటగాడైన ఆండ్రీ రసెల్ మాత్రం కేకేఆర్కు మాత్రమే ఎందుకు కొనసాగుతున్నాడు. అతను ప్రతీ సీజన్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఈ సీజన్లోనైనా మ్యాక్సీ మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా.'' అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.గంభీర్ నేతృత్వంలోనే కేకేఆర్ రెండు సార్లు(2012, 2014) ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
IPL 2021: ముంబైతో మ్యాచ్కు ముందు ఆర్సీబీకి గట్టి షాక్.. స్టార్ పేసర్కు కరోనా!
తాగి తందాన చేయడానికే..
ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 82 మ్యాచ్లాడి 1505 పరుగులు సాధించాడు. గత సీజన్లో కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. కానీ ఈ సీజన్ వేలంలో అతనిపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి. ఆర్సీబీ ఏకంగా రూ. 14.25 కోట్ల భారీ ధరకు మ్యాక్సీని కొనుగోలు చేసింది. ఇక మ్యాక్సీకి భారీ ధర రావడంపై ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే మ్యాక్సీ తాగితందాన చేయడానికే ఐపీఎల్కు వస్తాడని ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.
జట్టుతో కలిసిన మ్యాక్సీ..
ఇటీవలే ఆర్సీబీతో కలిసిన మ్యాక్స్వెల్.. నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ఈ క్రమంలో మైదానంలో భారీ షాట్లతో అలరించాడు. రివర్స్ స్వీప్ షాట్ కూడా ఆడాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఫోటోను తమ ట్విటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ షేర్ చేసింది. 'మ్యాక్స్వెల్ను ఆర్సీబీ జెర్సీలో చూడండం కంటే.. మంగళవారంను ప్రారంభించడానికి గొప్పగా ఇంకా ఏముంటుంది?' అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. మరో రెండు రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య చెన్నై వేదికగా జరగనుంది.