ఆ ముగ్గురికే చాన్స్..
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ ఫో షోలో పాల్గొన్న గంభీర్ను.. వచ్చే సీజన్లో ఆర్సీబీ.. మ్యాక్స్వెల్, యుజ్వేంద్ర చాహల్, విరాట్ కోహ్లీలను రిటైన్ చేసుకుంటుందా? అని ప్రశ్నించగా.. అవునని గంభీర్ సమాధానమిచ్చాడు. అయితే జాబితాలో తాను హర్షల్ పటేల్ను కూడా కలుపుతున్నాని చెప్పాడు. చాహల్, హర్షల్లో ఆర్సీబీ తమకు అవసరమైన వారిని తీసుకోవచ్చన్నాడు. 'అవును. కాకపోతే ఈ ముగ్గురికి నేను హర్షల్ పటేల్ను కలుపుతున్నా. చాహల్, హర్షల్ పటేల్లో ఒకరి తీసుకునే అవకాశం ఉంది. ఇది వారి ప్రణాళికలపై ఆధారపడి ఉంటుంది'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఏబీడీకి నో చాన్స్..
వచ్చే సీజన్లో డివిలియర్స్ని బెంగళూరు రిటైన్ చేసుకోదని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు..'అవును. రిటైన్ చేసుకోదు. గ్లెన్ మ్యాక్స్వెల్కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి అతడి రిటైన్ చేసుకుంటుందని అనుకుంటున్నా. డివిలియర్స్కి ఈ అవకాశం లేదు'అని సమాధానమిచ్చాడు. ఏబీ డివిలియర్స్ 2011లో ఆర్సీబీ జట్టులో చేరాడు. ఇప్పటివరకు 184 మ్యాచ్లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో డివిలియర్స్ 313 పరుగులు చేశాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్లో ఏబీడీ దారుణంగా విఫలమయ్యాడు. ఇక కోల్కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
కోహ్లీ తొందరపడ్డాడు..
అయితే కెప్టెన్సీ విషయంలో కోహ్లీ తొందరపడ్డాడని, రాంగ్ టైమ్లో సారథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సిందన్నాడు. అతని నిర్ణయమే ఆర్సీబీ వైఫల్యానికి కారణమైందన్నాడు. 'కోహ్లీ రాంగ్ టైమ్లో ప్రకటించాడు. కెప్టెన్సీ వదులుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరక ముందే చెప్పి ఆ జట్టు ఆటగాళ్లపై ఒత్తిడికి గురిచేసినట్లు అయింది. టోర్నీ ముగిసిన తర్వాత చెప్పాల్సిందనే నా అభిప్రాయం'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.