
టీ20 ప్రపంచకప్ జరుగుంటే..
ప్రస్తుతం ఐపీఎల్ కొనుసాగుతున్నప్పటికీ.. బీసీసీఐ కూడా మహీ కోసం ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయలేదు. అయితే తాజాగా ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ శరణ్ దీప్ సింగ్ ఈ విషయంపై స్పందించాడు. 'గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడటంతో ధోనీ ఫేర్వెల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ టోర్నీ వాయిదా పడటంతోనే మహీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టీ 20 ప్రపంచకప్ గనుక జరుగుంటే.. మహీ కచ్చితంగా ఆ మెగా టోర్నీ ఆడేవాడు. ఘన వీడ్కోలు కూడా అందుకునే వాడు'అని శరణ్ దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.

స్వాతంత్ర్య దినోత్సవం నాడే..
భారత స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రాత్రి 7.29 గంటలకు ధోనీ ఆటకు అల్విదా ప్రకటించాడు. ఎలాంటి ముందస్తు సమాచారం, మీడియా సమావేశం లేకుండా చాలా సింపుల్గా ఓ ఇన్స్టా పోస్ట్తో అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ కొద్ది సేపటికే ధోనీ బాటలో తాను అంటూ సురేశ్ రైనా సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు.

గోల్డెన్ డకౌట్తో ..
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్తో మొదలైనా.. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీ.. కెరీర్లో మొత్తం 350 వన్డేలు, 90 టెస్ట్లు, 98 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్గా వెలుగొందాడు. 2005లో శ్రీలంకతో మహీ తొలి టెస్టు ఆడగా.. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి దేశ క్రికెట్కు సరికొత్త బాట చూపిన రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్తో 2011 ప్రపంచకప్తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు.


Click it and Unblock the Notifications












