ఐసీసీతో వర్షం సంబంధం విడదీయరానిది..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి వర్షానికి విడదీయలేని బంధం ఉందని, వీరి మధ్య భార్యభర్తలకు మించిన అనురాగం, అప్యాయతలున్నాయని నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఐసీసీ నిర్వహించే ప్రతీ టోర్నీలో వర్షం వస్తుందని, తద్వారా ఆతిథ్య దేశంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కామెంట్ చేశారు. విజయం కోసం ఇరు జట్లలోని 11 మంది ఆటగాళ్లు సిద్దమయితే.. ఎక్స్ట్రా ప్లేయర్గా వర్షం బరిలోకి దిగుతుందని సెటైర్లు పేల్చుతున్నారు.
సెమీస్కు ఐర్లాండ్, జింబాబ్వే..
ఐర్లాండ్, జింబాబ్వే జట్లు సెమీస్ చేరేందుకు వర్షం సహకరిస్తుందని, మరో నాలుగు మ్యాచ్లు మింగేస్తే ఈ రెండు జట్లు నాకౌట్లో తలపడతాయని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ రోజు జరగాల్సిన రెండు మ్యాచ్ల్లో వర్షమే గెలిచిందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అసలు సిసలు మ్యాచ్లన్నీ వర్షం కారణంగా రద్దవుతుండటం తమను తీవ్రంగా నిరాశపరుస్తుందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీకి బుద్ది లేదు..
వర్షాలు పడే సమయమని తెలిసినా... ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022ను షెడ్యూల్ చేయడం సిగ్గు చేటని, గత అనుభవాలను నుంచి ఏం నేర్చుకోలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు పడుతాయని తెలిసినా అక్కడే టోర్నీ నిర్వహించడం సరికాదని మండిపడుతున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ ఈ నిర్లక్ష్య వైఖరి పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ను నిర్వహించడంలో చేతులెత్తేసిందని, దీన్ని గంగపాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖెల్ వాన్ క్రికెట్ ఆస్ట్రేలియా తీరును తప్పుబట్టాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వర్షా కాలం కొనసాగుతోందని, అయినా కనీస జాగ్రత్తలను తీసుకోలేదని మండిపడ్డాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్కు రూఫ్ కవర్ సౌకర్యం ఉన్నా ఎందుకు వినియోగించలేదని నిలదీశారు.


Click it and Unblock the Notifications












