ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ముగిసింది. నాలుగో జట్టుగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇతర మ్యాచ్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి.
ఇప్పుడు ఈ నాలుగు జట్లు టాప్-2 ప్లేస్లో నిలవడంపై ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-1 ఓడినా క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు టీమ్స్ టాప్-2 ప్లేస్పై కన్నేసాయి.

టాప్-2 నిలవాలంటే..?
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్ల్లో 9 విజయాలు 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా గుజరాత్ టైటాన్స్ టాప్-2 ప్లేస్ ఖరారు అవుతుంది. రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్ సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్లతో తదుపరి రెండు మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లకు రెండు గెలిస్తే ఆర్సీబీ టాప్-2 ప్లేస్ ఖరారు అవుతుంది. ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
పంజాబ్ కింగ్స్ కూడా 12 మ్యాచ్ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టాప్-2లో నిలుస్తోంది. ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 16 పాయింట్స్తో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో జరిగే ఆఖరి మ్యాచ్ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర జట్లు 18 పాయింట్స్కే పరిమితమైతే మాత్రం ముంబైకి టాప్-2లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలోనే తదుపరి లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా సాగనున్నాయి.
ఫైనల్లో ఆర్సీబీ X ముంబై..
ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అర్హత సాధించడంతో.. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత జనాదరణ కలిగిన ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగితే.. ఐపీఎల్ 2025 సీజన్ చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ మ్యాచ్గా చరిత్రకెక్కుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ రెండు జట్లు ఫైనల్ చేరి ఆర్సీబీ విజయం సాధించాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటే.. ఫైనల్ చేరితో ఓడిన చరిత్ర ముంబైకి లేదని ఆ టీమ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరితే సినిమాకు మించిన డ్రామా ఉంటుందని, ఊహించుకుంటేనే ఎలానో ఉందని కామెంట్ చేస్తున్నారు. 'ఫైనల్లో ఆర్సీబీ X ముంబై ఇండియన్స్.. అప్పుడు ఉంటుందిరా చారీ'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.