న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌తో ఫస్ట్ టెస్ట్‌కు ఇంగ్లండ్ టీమ్‌లో నో చేంజ్.. విండీస్‌పై గెలిచిన జట్టుతోనే..

England name unchanged 14-man squad for first Pakistan Test

మాంచెస్టర్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. వెస్టిండీస్‌పై విజయం సాధించిన 14 మంది సభ్యుల జట్టునే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు అదనంగా జేమ్స్ బ్రాసే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, డాన్ లారెన్స్‌ను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది.

మాంచెస్టర్‌లో వచ్చే బుధవారం(ఆగస్టు 5న) ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మొదలవ్వనుంది. ఈ సిరీస్ కూడా బయో సెక్యూర్ వాతావారణంలో జరుగుతుందని ఈసీబీ వెల్లడించింది. సిరీస్‌లో మిగిలిన రెండు టెస్ట్‌లు సౌతాంప్టన్‌లో జరుగుతాయి. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఓడినా.. రెండో టెస్ట్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సూపర్ పెర్ఫామెన్స్‌తో అద్భుత విజయాన్నందుకుంది. ఇక సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బౌలింగ్‌లో చెలరేగడంతో విండీస్‌పై సునాయస విజయాన్నందుకొని సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇంగ్లండ్ జట్టు:
జోరూట్(కెప్టెన్), బెన్‌ స్టోక్స్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, ఓలీ పోప్, డామ్ సిబ్లే, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

రిజర్వ్ ప్లేయర్స్: జేమ్స్ బ్రాసే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, డాన్ లారెన్స్‌

Story first published: Thursday, July 30, 2020, 9:33 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X