శిఖర్ ధావనే ఓపెనర్..
'నాకెందుకో రానున్న ప్రపంచకప్లో శిఖర్ ధావన్ ఓపెనర్గా ఆడతాడని అనిపిస్తోంది. ఎందుకంటే ముప్పై ఏళ్లు దాటిన ఈ ఆటగాడిని పక్కనపెట్టడం చాలా తేలిక. కానీ, సెలెక్టర్లు అతని చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. న్యూజిలాండ్తో వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వడానికి సైతం వారు ఆసక్తి చూపారు. అతను సందర్భానికి తగినట్లుగా తనను తాను మలచుకునే వ్యక్తి. ఆటలో స్థిరత్వం చూపుతాడు.
ఐపీఎల్తో చాన్స్..
2019 ప్రపంచకప్ సమయంలోనూ గాయానికి ముందు అతను ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒక్కసారిగా అతను తన ఫామ్ను కోల్పోతే తప్ప.. జట్టులో కొనసాగడానికి పూర్తిగా అర్హుడు. ఓపెనింగ్ బ్యాటర్గా ధావన్ నమ్మదగిన వ్యక్తి. ఎందుకంటే, అతనికి గేమ్ ప్లాన్ తెలుసు. క్రీజును చక్కగా ఉపయోగించుకుంటాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐపీఎల్కు ముందు అతను కోరుకుంటున్నట్టుగా మరో మంచి అవకాశం దొరుకుతుంది'అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.
పంజాబ్ కెప్టెన్గా
టీమిండియాకు కెప్టెన్గా ఎంపికవ్వడానికి ముందే ధావన్ను ఐపీఎల్ 2023లో పంజాబ్ జట్టు కెప్టెన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇతని నేతృత్వంలో భారత్ న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను ఆడుతోంది. అయితే, తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియాకు రెండో మ్యాచ్లో వర్షం రూపంలో ఆటంకం ఎదురైంది. ఇక ఈ సిరీస్లో ఎంతో కీలకమైన మూడో వన్డే క్రైస్ట్చర్చ్ వేదికగా బుధవారం జరగనుంది.