నేను ఆస్వాదిస్తున్నా..
‘ఐపీఎల్లో ఫ్రాంఛైజీ ఓనర్లు ఆటగాళ్లని చూసే విధానం, గెలుపోముల్ని స్వీకరించే తీరుని నేను మొదటి నుంచి గమనిస్తున్నా. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే..? ఆటగాళ్లని హ్యాండిల్ చేయడంలో కోల్కతా నైట్రైడర్స్ బెస్ట్ అని. క్లిష్ట పరిస్థితుల్లోనూ కేకేఆర్ ఫ్రాంఛైజీ.. ఆటగాళ్లతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. కోల్కతా జట్టులో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా'' అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.
ఐదు ఫ్రాంచైజీలు..
ఐపీఎల్ ఆరంభ సీజన్లో తొలుత ఢిల్లీ డేర్డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ఆడాడు. అయితే.. 2018 ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల వేలంలో దినేశ్ కార్తీక్ను రూ. 7.4 కోట్లకి కొనుగోలు చేసిన కోల్కతా.. అనూహ్యంగా అతనికి సారథ్య బాథ్యతలు అప్పగించింది.
దినేశ్ కార్తీక్పై వేటు వేస్తారని..
వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్కి దినేశ్ కార్తీక్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభమన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు వచ్చాయి. గత రెండు సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ వైఫల్యానికి కారణం అతని పేలవ కెప్టెన్సీ అనే విమర్శలు వచ్చాయి. కానీ.. కరోనాతో క్రికెట్కు బ్రేక్ రావడంతో ఈ చర్చ కనుమరుగైంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్న విషయం తెలిసిందే.