న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ధోనీ..

India Vs West Indies 2018,4th ODI :Dhoni Falls A Run Short To Enter 10k ODI Club For India| Oneindia
Dhoni falls one run short of 10k runs for India

హైదరాబాద్: కొద్ది రోజులుగా పేలవ ఫామ్ విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అరుదైన ఘనతకు చేరువైయ్యాడు. భారత్‌ తరపున వన్డే ఫార్మాట్‌లో పది వేల పరుగుల మార్కును చేరేందుకు ధోనీ కేవలం పరుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోని.. మరో పరుగు సాధిస్తే టీమిండియా తరపున పది వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు

సోమవారం వెస్టిండీస్‌తో ఆడిన నాల్గో వన్డేలో ధోనీ కెరీర్‌లో భారత్ తరపున 9999పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2007లో ఆఫ్రికా ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసియా ఎలెవన్‌ తరపున ఆడిన ధోని ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ ధోని వన్డే ఫార్మాట్‌లో చేసిన పరుగులు 10, 173 కాగా, భారత్‌ ఆటగాడిగా మాత్రం ఆ ఘనతను చేరుకోలేదు.

అనుమానాలన్నింటినీ ఎగరగొట్టిన అంబటి రాయుడు

పదివేలకు పరుగు దూరంలో

పదివేలకు పరుగు దూరంలో

భారత్‌ తరపున పదివేల పరుగులు పూర్తి చేసేందుకు పరుగు దూరంలో నిలిచాడు ధోని. 2018వ సంవత్సరంలో ధోనీ 12 ఇన్నింగ్స్‌లో ఆడి 252 పరుగులు చేశాడు. కాగా గతంతో పోలిస్తే ప్రస్తుత స్ట్రైక్ రేట్ 68.10తో తక్కువగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

చివరిదైన ఆఖరి వన్డేలో ధోనీకి అవకాశం

చివరిదైన ఆఖరి వన్డేలో ధోనీకి అవకాశం

తిరువనంతపురంలో గురువారం జరుగనున్న చివరిదైన ఆఖరి వన్డేలో ధోని ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఈ పేలవ ఫామ్ కారణంగానే అతనిని వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు, ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాలో సెలక్టర్లు స్థానం కల్పించలేకపోయారు.

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రోహిత్‌ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్‌ అహ్మద్‌ (3/13), కుల్‌దీప్‌ (3/42) ధాటికి ఛేదనలో విండీస్‌ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Tuesday, October 30, 2018, 11:48 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X