చెలరేగిన కాన్వే:
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కివీస్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (0), టీమ్ సీఫెర్ట్ (1)లు నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (12) కూడా ఆకట్టుకోలేదు. అయితే కెరీర్లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దేవన్ కాన్వే చెలరేగి ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయడంతో సెంచరీని పరుగు దూరంలో మిస్సయ్యాడు.
కివీస్ బౌలర్లు జలక్:
ఓ దశలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన్ కివీస్కు దేవన్ కాన్వే భారీ స్కోర్ అందించాడు. గ్లెన్ ఫిలిప్స్ (30), జేమ్స్ నీషమ్ (26)లు చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో కివీస్ మంచి స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో డేనియల్ సామ్స్, జే రిచర్డ్సన్ తలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు కివీస్ బౌలర్లు జలక్ ఇచ్చారు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్లు తొలి 5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీశారు. ఓ దశలో 19 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. దాంతో ఆసీస్ ఏ దశలోనూ కివీస్కు పోటీ ఇవ్వలేకపోయింది. లెగ్ స్పిన్నర్ ఐస్ సోథి 4 వికెట్లు తీసుకున్నాడు. మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 131 రన్స్కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్.
|
8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసిన బెంగళూరు:
చెన్నైలో గత గురువారం జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి రూ.35.40 కోట్లతో వెళ్లిన బెంగళూరు 8 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో పవర్ హిట్టర్ లేని లోటుని గ్లెన్ మాక్స్వెల్తో భర్తీ చేసుకున్న కోహ్లీసేన.. విదేశీ పేసర్ లోటుని కైల్ జెమీషన్తో భర్తీ చేసుకుంది. ఈ ఇద్దరి కోసం 29.25 కోట్లకి వేలంలో బెంగళూరు కేటాయించింది. సచిన్ బేబీ (రూ.20 లక్షలు), రాజత్ పటిదార్ (రూ.20 లక్షలు), మహ్మద్ అజహరుద్దీన్ (రూ.20 లక్షలు), డేనియల్ క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు), ప్రభుదేశాయ్ ( రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)లను బెంగళూరు కొనుగోలు చేసింది.
IPL 2021 Auction: చెన్నైతో పోటీ ముందే ఊహించి.. మాక్స్వెల్ కోసం బెంగళూరు ప్రణాళిక!!