
మోసం చేయడం ఓ కళ:
లెప్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ వీడియోను ఆర్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. 'మనం చేసేది తప్పా లేక ఒప్పా అన్నది కేవలం అవగాహన మాత్రమే.. అందుకే బౌలింగ్తో ఎదుటివారిని ముప్పతిప్పలు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మోసం చేయడం అనేది ఒక కళ.. అది అందరికి అబ్బదు' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అశ్విన్ ఐపీఎల్లో ఇప్పటివరకు 139 మ్యాచ్లాడి.. 125 వికెట్లు తీశాడు. ఎక్కువకాలం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని:
మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ రాకతో భారత వన్డే, టీ20 జట్టుకి గత మూడేళ్ల నుంచి దూరంగా ఉంటున్న ఆర్ అశ్విన్.. ఐపీఎల్ 2020 సీజన్లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అశ్విన్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 71 టెస్టుల్లో, 11 వన్డేల్లో, 46 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 365, వన్డేల్లో 150, టీ20ల్లో 52 వికెట్లు తీసాడు.

పంజాబ్తో తొలి మ్యాచ్:
ఇంతవరకు ఐపీఎల్లో ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. 2019లో శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన ఢిల్లీ.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్కు చేరింది. ఈసారి ఢిల్లీ జట్టుకు అధనంగా ఆర్ అశ్విన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు చేరడం మరింత బలం చేకూర్చింది. సెప్టెంబర్ 20న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో తొలి మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్.. నవంబర్ 2న జరిగే లీగ్ ఆఖరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.
బౌలర్లు తస్మాత్ జాగ్రత్త.. ఐపీఎల్కి ఓ రేంజ్లో సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ (వీడియో)


Click it and Unblock the Notifications












