For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Deepak Chahar vs Martin Guptill ‘లుక్’ వార్.. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదే!(వీడియో)

Deepak Chahar vs Martin Guptill: Indian Pacer wins battle of cold stares after Guptills no-look six
IND VS NZ 2021 : Deepak Chahar ఇగోని టచ్ చేసిన Martin Guptill || Oneindia Telugu

జైపూర్: సాధారణంగా ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరగడం చూస్తుంటాం! కానీ భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన ఫస్ట్ టీ20లో 'లుక్'వార్ నడిచింది. ఇరు జట్ల ఆటగాళ్లు కనుచూపులతోనే నువ్వెంతా? అంటే నువ్వెంతా? అనుకున్నారు. టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మధ్య జరిగిన ఈ నిశబ్ధ యుద్దం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తొలుత గప్టిల్ సీరియస్ లుక్‌తో ఈ గొడవకు ఆజ్యం పోయగా.. అనంతరం దీపక్ చాహర్ తగ్గేదేలే అంటూ సీరియస్ లుక్‌తో బదులిచ్చాడు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ సందర్భంగా దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి బంతిని దీపక్ చాహర్ స్లాట్‌లో వేయగా.. మార్టిన్ గప్టిల్ సునాయసంగా స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. గప్టిల్ ఆ షాట్ కొట్టిన తర్వాత కనీసం బంతి వైపు కూడా చూడలేదు. దీపక్ చాహర్ వైపు సీరియస్‌గా చూస్తూ అతని ఇగోను టచ్ చేశాడు. సైలెంట్‌గా అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

ఆ మరుసటి బంతిని కూడా దీపక్ చాహర్ అదే రీతిలో వేశాడు. కానీ బంతి వేగం తగ్గించడంతో గప్టిల్ క్రీజులోకి డీప్‌గా వెళ్లి భారీ షాట్ ఆడాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కానీ బంతి గాల్లోకి లేవగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో ఎలాంటి సంబరాలు చేసుకోని దీపక్ చాహర్.. అతని వైపు చూస్తూ కన్నెర్ర చేశాడు.

గెలికి మరి తన్నించుకోవడం ఇదే..

ఈ వీడియోను చూసిన అభిమానులు గప్టిల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా దీపక్ చాహర్ ఇగో టచ్ చేసి గప్టిల్ మూల్యం చెల్లించుకున్నాడని ట్వీట్ చేస్తున్నారు. ఇక తన తప్పిదాన్ని తెలుసుకున్న గప్టిల్.. పశ్చాతాపంతో మాట మాట్లాడకుండా పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ సీరియస్ లుక్ ఇస్తున్నా అతని వైపు చూడను కూడా చూడలేదు. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

చెలరేగిన సూర్య, రోహిత్..

చెలరేగిన సూర్య, రోహిత్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరుగుతుంది.

Story first published: Thursday, November 18, 2021, 11:12 [IST]
Other articles published on Nov 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+