రెండు వారాల్లో చెబుతాం..
‘కరోనా పరిస్థితుల నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్ వాయిదా వేయాలా లేదంటే షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లాలా అన్నదానిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాం. టోర్నీ విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత వస్తే మేలు అని భావిస్తున్నాం. ఒక వేళ నిర్ణయం ఆలస్యమైతే మేం అప్పటికే అన్ని వనరులను ఉపయోగించుకుని చాలా ఏర్పాట్లు చేసేస్తాం. అలాంటప్పుడు రద్దయితే చాలా నష్టపోతాం. అన్ని జట్లను ఇక్కడకు తీసుకురావడం, క్వారంటైన్ నిబంధనలు పాటించడం.. చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. అందుకే తొందరపడుతున్నాం'అని కివీస్ క్రికెట్ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నారు.
భారత మహిళల ఇంగ్లండ్ పర్యటన రద్దు
భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన రద్దయింది. ప్రస్తుతానికి ఇరు దేశాల బోర్డులు అధికారికంగా ప్రకటించకున్నా.. దాదాపు ఈ టూర్ అటకెక్కినట్లేనని తెలుస్తోంది. కరోనా కారణంగా మన జట్టు అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి లేదు కాబట్టి టూర్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జూన్లోనే భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడాల్సింది. అప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా... ఇప్పుడు పూర్తిగా రద్దయినట్లే.
ముక్కోణపు సిరీస్ అన్నా..
అయితే వచ్చే సెప్టెంబరులోనైనా భారత్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ముక్కోణపు టోర్నీ నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సెప్టెంబర్లోనూ ఈ ముక్కోణపు సిరీస్కు ఆతిథ్య ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక భారత్ రాకపోతే దక్షిణాఫ్రికాతోనైనా ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.