రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఫీట్ సాధించాడు.
రిషభ్ పంత్ను క్యాచ్ ఔట్గా చేర్చి టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 301 మ్యాచ్ల్లో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న 11వ బౌలర్గా నిలిచాడు. చాహల్ కన్నా ముందు డ్వేన్ బ్రావో, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగా, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ ఫీట్ సాధించారు.

భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తర్వాత పియూష్ చావ్లా(293 మ్యాచ్ల్లో 310), రవిచంద్రన్ అశ్విన్(318 మ్యాచ్ల్లో 306), భువనేశ్వర్ కుమార్(281 మ్యాచ్ల్లో 297 వికెట్లు) అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఉన్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41) మెరుపులు మెరిపించాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిక్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు.