
షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్నమైదానం కావడం, భారీ హిట్టర్లు ఉండటంతో ఫీల్డింగ్ తీసుకుంటున్నామని దినేశ్ కార్తీక్ తెలిపాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి మ్యాచ్లో గాయపడి జట్టుకు దూరమైన ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో వచ్చాడు. కోల్కతాలో కుల్దీప్ స్థానంలో రాహుల్ త్రిపాఠి అవకాశం దక్కించుకున్నాడు.
వరుసగా రెండు విజయాలతో కోల్కతా నైట్ రైడర్స్ ఊపు మీదుండగా.. గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో దెబ్బతిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గాడిలో పడాలని పట్టుదలగా ఉంది.
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడగా 13-10తో కేకేఆర్ లీడ్లో ఉంది. అదే ఆధిపత్యం చెలాయించాలని కార్తీక్ సేన భావిస్తుండగా.. లెక్క సరిచేయాలనే ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ ఉంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, షిమ్రాన్ హెట్మైర్, మార్కస్ స్టోయినిస్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, నోర్జ్, మిశ్రా, హార్దిక్ పటేల్
కోల్కతా నైట్ రైడర్స్: శుభ్మన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్(కెప్టెన్, కీపర్), రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, నాగర్కోటి, సీవీ వరుణ్