
కథ ముగిసింది..
అయితే తనను వేలంలోకి వదిలేయడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా కథ ముగిసిందంటూ.. ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 'అధ్యాయం ముగిసింది. గత కొన్నేళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు, సన్రైజర్స్ హైదరాబాద్కు ధన్యవాదాలు'అని వార్నర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. జానీ బెయిర్ స్టో సైతం.. సన్రైజర్స్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. సన్రైజర్స్ ముగ్గురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో.. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.68 కోట్లు ఉన్నాయి.
2014 సీజన్ నుంచి..
ఐపీఎల్ 2014 సీజన్ వేలంలో రూ. 5.5 కోట్లకి డేవిడ్ వార్నర్ని కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత ఏడాదే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కెప్టెన్గా టీమ్ని ముందుండి నడిపించిన వార్నర్ ఐపీఎల్ 2016 సీజన్లో హైదరాబాద్ను విజేతగా నిలిపాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ భారంగా భావించింది. సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. దాంతో.. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ని వార్నర్ వీడటం లాంఛనంగా మారిపోయింది.

కొత్త జట్లకే వార్నర్..
2014 నుంచి హైదరాబాద్ టీమ్కి ఆడిన వార్నర్.. 95 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 142.59 స్ట్రైక్రేట్తో 4014 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్లో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. బ్యాట్స్మెన్గానే కాకుండా.. కెప్టెన్గానూ డేవిడ్ వార్నర్ ఫెయిలయ్యాడు. దాంతో.. సీజన్ మధ్యలోనే అతడ్ని అవమానకరరీతిలో కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ తర్వాత జట్టు నుంచి కూడా వేటు వేశారు.
అయినప్పటికీ.. స్టాండ్స్లో కూర్చుని హైదరాబాద్ టీమ్ని వార్నర్ ప్రోత్సహించాడు. ఇప్పటికీ తనని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గల కారణం తెలియదని వార్నర్ చెప్తున్నాడు. తనకు సన్రైజర్స్తోనే ఉండాలనుందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కొత్త జట్లలోని అహ్మదాబాద్, లక్నో టీమ్స్ పికప్ ఆప్షన్ కింద వార్నర్ను తీసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
