For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా డార్లింగ్‌తో ఇదే నా చివరి పెగ్.. కొన్ని నెలలు తప్పదు బేబీ.. మిస్ యూ: డేవిడ్ వార్నర్

David Warner raises a last toast before heading to Sunrisers Hyderabad camp for IPL 2021

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సిద్దమయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను గురువారం ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోలో తన సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి డేవిడ్ భాయ్ వైన్ తాగుతున్నాడు. ఈ ఫొటోకు తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చిన హైదరాబాద్ కెప్టెన్.. భారత్‌కు వచ్చే సమయం ఆసన్నమైందని, తన డార్లింగ్‌తో ఇదే చివరి పెగ్ అంటూ పేర్కొన్నాడు.

'నా డార్లింగ్‌తో ఇదే నా చివరి పెగ్. అదృష్టవశాత్తు కొన్ని నెలలు కుటుంబంతో గడిపే సమయం దొరికింది. కానీ ఇప్పుడు బ్యాగ్‌లు సర్దుకొని భారత్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. లవ్ యూ డార్లింగ్.. మిస్ యూ'అంటూ వార్నర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.

అనుమనాలన్నీ..

భారత్ పర్యటనలో గజ్జ గాయానికి గురైన డేవిడ్ వార్నర్.. పూర్తిగా నయమవ్వకుండానే టెస్ట్ సిరీస్‌ ఆడాడు. దాంతో గాయం తిరగబెట్టి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు ఆడటం అనుమానమేనని ఊహాగానాలు వినిపించాయి. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. సెంచరీతో చెలరేగి ఫామ్ అందుకున్నాడు. దాంతో అతని గాయంపై జరగిన ప్రచారాలన్నీ అవాస్తవాలేనని తేలింది.

రెండు రోజుల క్రితం

రెండు రోజుల క్రితం

రెండు రోజుల క్రితం ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వస్తున్నానని వార్నరే స్వయంగా వెల్లడించడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. భారత్‌కు వచ్చే ముందు వార్నర్‌ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ విషయాన్ని అతనే తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పంచుకున్నాడు. దాంతో ఇప్పటికే వార్నర్ భారత్‌కు వచ్చాడని అంతా భావించారు. కానీ తాజా పోస్ట్‌తో అతను ఇంకా రాలేదనే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ ప్రొటోకాల్స్ ప్రకారం వార్నర్ వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ లేక్కన అతను జట్టుతో కలిసే సరికి లీగ్ ప్రారంభం కానుంది.

ఏప్రిల్ 11న..

ఏప్రిల్ 11న..

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్‌ను మినహాయించారు. చెన్నై వేదికగా జరిగే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్‌ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

జట్టుతో చేరిన నట్టూ..

జట్టుతో చేరిన నట్టూ..

సన్‌రైజర్స్ సెన్సేషన్, యార్కర్ల కింగ్ టీ నటరాజన్ గురువారం జట్టుతో కలిసాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ యార్కర్ కింగ్ వచ్చాడంటూ పేర్కొంది. ఇక వ్యక్తిగత కారణాలతో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తప్పుకోగా జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్.. క్వాలిఫయర్స్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడి ఇంటిముఖం పట్టింది.

Story first published: Thursday, April 1, 2021, 15:29 [IST]
Other articles published on Apr 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+