For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: సీఎస్‌కేకు బిగ్ షాక్.. రూ.14.20 కోట్ల ఆటగాడికి తీవ్ర గాయం!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.14.20 కోట్ల భారీ ధర పెట్టి సీఎస్‌కే కొనుగోలు చేసిన అనామక ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తీవ్ర గాయమైంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రశాంత్ వీర్.. శుక్రవారం జార్ఖండ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.

బౌండరీ వెళ్లకుండా బంతిని ఆపేందుకు ప్రశాంత్ వీర్ డైవ్ చేయగా..అతని కుడి భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిలలాడిన ప్రశాంత్ వీర్‌ను ఫిజియోలు మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కొన్నివారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. అతని భుజంలో గ్రేడ్-2 చీలిక ఉంటే మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్ సమయానికి కోలుకున్నా..

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమయ్యే సమయానికి అతను కోలుకునే ఛాన్స్ ఉంది. అయితే గాయం తర్వాత అతను మునపటిలా సత్తా చాటగలుగుతాడా? లేదా? అనేది సీఎస్‌కే ఫ్యాన్స్‌కు ఆందోళనగా మారింది. ఐపీఎల్ 2026 మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. అతి త్వరలోనే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేసే ప్రశాంత్ వీర్ కోసం ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటాపోటీగా బిడ్ వేసాయి. చివరకు సీఎస్‌కే రూ.14.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

CSK s Rs 14 20 Crore uncapped player Prashant Veer Suffers Shoulder Injury Ahead of IPL 2026

జడేజా 2.O

ప్రశాంత్ వీర్ పూర్తి పేరు ప్రశాంత్ రామేంద్ర వీర్. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో 2005, నవంబర్ 24న జన్మించాడు. ప్రశాంత్‌ వీర్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. అతని తండ్రి 'శిక్షా మిత్ర'(గ్రామీణ ప్రాంతాల్లో టీచర్‌)గా పని చేస్తున్నారు. తల్లి గృహిణి. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ అతను. తన ఆట తీరు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పోలి ఉండటంతో ప్రశాంత్ వీర్‌ను జడేజా 2.o అని పిలుస్తారు. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకే ప్రశాంత్ వీర్‌పై సీఎస్‌కే కోట్లు కుమ్మరించింది.

యూపీ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ప్రశాంత్ వీర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు యూపీ టీ20 లీగ్‌లో సత్తా చాటాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీతోనే ప్రశాంత్ వీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గతేడాది డిసెంబర్‌లో లిస్ట్-ఏ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రశాంత్ వీర్.. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీయడంతో పాటు 133 పరుగులు చేశాడు. 2023లో టీ20 క్రికెట్ మొదలు పెట్టిన ప్రశాంత్.. 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో పాటు 112 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు దిగి భారీ సిక్స్‌లు బాదడం ప్రశాంత్ వీర్ ప్రత్యేకత. ఈ సామర్థ్యాన్ని గ్రహించే ఈ కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

Story first published: Friday, January 23, 2026, 18:06 [IST]
Other articles published on Jan 23, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+