ఐసీసీ కొత్త రూల్స్
క్రికెట్ ఆటలో బౌలర్ వికెట్ తీయగానే సహచరులు అతణ్ని చుట్టుముట్టి కరచాలనం చేస్తారు. మ్యాచ్ మరీ ముఖ్యమైన సందర్భాల్లో ఒక్కోసారి బౌలర్ను ఎత్తుకొని చిందులేస్తారు. అయితే ఇవన్ని ఒకప్పుడు చేసినవి. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ కొత్త రూల్స్ తెచ్చింది. ఈ సమయంలో మనుషుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని ఆటగాళ్లకు బోర్డులు కూడా సూచించాయి. వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్ ఐసీసీ, విండీస్ బోర్డు సూచనలు చక్కగా పాటించాడు.

మాస్క్ ధరించి సంబరాలు
బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ మరియు గయానా అమెజాన్ వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. గయానా జట్టు తరుపున బౌలింగ్ చేసిన కీమో పాల్.. ఏడో ఓవర్లో కీలక వికెట్ తీశాడు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు పాల్ను అభినందించేందుకు వచ్చారు. అయితే వారిని దగ్గరకు రావద్దని సైగలు చేస్తూ.. మాస్క్ ధరించి దూరంగా వెళ్లాడు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పాల్ ఈ రకంగా ప్రవర్తించాడు. దీనికి సంబందించిన వీడియోను సీసీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

గయానా బోణీ
బుధవారం జరిగిన సీపీఎల్ మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్ బోణీ కొట్టింది. సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెయాడ్ ఎమ్రిట్ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగిన మొదటి మ్యాచులో గయానా ఓడిపోయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

IPL 2020: ప్రామిస్.. ఇదే మా చివరి పోస్టు!!










