
చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయండి
భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో టోర్నీ ముగిసిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాను క్రిస్ లిన్ కోరాడు. 'ఐపీఎల్ ఒప్పందంలో భాగంగా సీఏ 10శాతం మొత్తాన్ని చార్టర్డ్ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం' అని లిన్ పేర్కొన్నాడు.

ఆసీస్ ప్రధాని ఏమన్నాడంటే
ఐపీఎల్ 2021 ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. 'ఐపీఎల్ 2021 కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్కు ప్రైవేట్గా వెళ్లారు. అదేమీ ఆస్ట్రేలియా టూర్ కాదు. వాళ్లకు సొంత వనరులు ఉన్నాయి. ఆటగాళ్లు వాటిని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకుని వారంతా ఆస్ట్రేలియాకు వస్తారని భావిస్తున్నా' అని ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించడం విశేషం.
DC vs RCB: తొలి బ్యాట్స్మన్గా ఏబీ డివిలియర్స్ అరుదై ఘనత!!

బీసీసీఐ హామీ
భారత్లో వైరస్ కరాళనృత్యం చేస్తుండడంతో ఐపీఎల్ లీగ్లో అలజడి రేగుతున్నది. మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు భయపడుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ సీజన్ నుంచి తప్పుకోగా.. మరికొందరు అదే బాట పట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నాకే టోర్నీ ముగిసినట్టు అని బీసీసీఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications












