
ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను
శనివారం మీడియా సమావేశంలో చెతేశ్వర్ పుజారా మాట్లాడాడు. 'నేను బాగానే ఆడాను. కానీ ఓ మంచి బంతికి ఔటయ్యా. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను. పాట్ కమిన్స్ ఆడలేని బంతులు విసురుతున్నాడు. నేను ఔటైన బంతి కచ్చితంగా 'బాల్ ఆఫ్ ది సిరీస్'గా నిలుస్తుంది. బ్యాక్ లెంగ్త్తో వేసిన ఆ బంతిని వదిలేయాలనుకున్నా. కానీ అది ఎక్స్ట్రా బౌన్స్ అయింది. మీ రోజు కానప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి' అని పుజారా తెలిపాడు.

నేను 100 శాతం ఫిట్నెస్తో లేను
మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చెతేశ్వర్ పుజారా వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయం బ్యాటింగ్పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు అతడు సమాధానం ఇచ్చాడు. 'గాయం ప్రభావమేమీ లేదు. అయితే నేను 100 శాతం ఫిట్నెస్తో లేను. తక్కువ నొప్పిని భరించగలను. అయితే ఇది ఎంతో కీలక మ్యాచ్ కాబట్టి దూరంగా ఉండలేను' అని నయావాల్ చెప్పాడు.
మూడో రోజు ఆటలో 330-340 పరుగులు సాధించడానికి గొప్పగా ప్రయత్నించామని, కానీ రిషభ్ పంత్ ఔటవ్వడం టర్నింగ్ పాయింట్గా మారిందని పుజారా తెలిపాడు. పంత్ ఔటైన తర్వాత ఆసీస్ పైచేయి సాధించిందన్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

జడేజా దూరమవ్వడం ప్రతికూలాంశం
గాయంతో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్కు దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమని చెతేశ్వర్ పుజారా తెలిపాడు. జడేజా గైర్హాజరీతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందన్నాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు సాధించిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవాడని పేర్కొన్నాడు. ఆల్రౌండర్గానే కాకుండా గొప్ప ఫీల్డర్గా జడేజా జట్టుకు విలువైన ఆటగాడని ప్రశంసించాడు. జడేజా గైర్హాజరీ జట్టుకు లోటైనా.. గొప్పగా పుంజుకుని ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎడమచేతి బొటనవేలుకి గాయమవ్వడంతో జడేజా మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే.

భారత్ లక్ష్యం 407:
భారత్తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 312/6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. కామెరాన్ గ్రీన్ (84; 132 బంతుల్లో 8x4, 4x6) ఔటయ్యాక టీ విరామ సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో గ్రీన్.. కీపర్ సాహా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ 87 ఓవర్లలో 312/6 స్కోర్ సాధించింది. భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 407 పరుగులు చేయాల్సి ఉంది.
బ్రిస్బేన్ టెస్టులో ఆడతాం.. కానీ మొదటి ఫ్లయిట్లోనే పంపాలి: బీసీసీఐ


Click it and Unblock the Notifications












