
333 పరుగులతో ఆసీస్ విజయం:
ఆ సమయంలో స్టీవ్ స్మిత్ సాధించిన సెంచరీ భారత గడ్డపై విదేశీ ఆటగాళ్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. స్మిత్ పోరాటంతో ఆసీస్ ఆ టెస్టులో 333 పరుగులతో విజయం సాధించింది. అయితే స్మిత్ ఆ ఇన్నింగ్స్ను తాజాగా గుర్తుచేసుకున్నాడు. మాజీ కెప్టెన్ సోమవారం ఇన్స్టా వేదికగా చిట్చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఆ ఇన్నింగ్స్ గురించి ఓ అభిమాని అడగ్గా.. స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జారవిడిచిన క్యాచ్ల కారణంగానే అది గొప్ప ఇన్నింగ్స్ అయిందన్నాడు.

అదృష్టం కలిసొచ్చింది:
'అదృష్టం కలిసొచ్చింది. నేను ఇచ్చిన క్యాచ్లను భారత ఆటగాళ్లు ఐదు సార్లు వదిలేశారు. అంటే ఒక్కోదానికి లెక్క వేసుకుంటే ఐదు సార్లు 20 పరుగుల చొప్పున చేశానంతే' అని స్మిత్ ఇన్స్టాగ్రామ్ చాట్లో అభిమానికి బదులిచ్చాడు. ఈ చాట్లో భారత క్రికెటర్ల గురించి కూడా అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు.

ధోనీ ఓ దిగ్గజం:
భారత బ్యాట్స్మెన్లలో తనను బాగా ఇంప్రెస్ చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ పేరు చెప్పాడు స్టీవ్ స్మిత్. అలాగే బ్యాటింగ్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రాక్షసుడిలాంటి వాడని పేర్కొన్నాడు. పాక్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడతానని వెల్లడించాడు. ఇక భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఓ దిగ్గజంగా అభివర్ణించాడు. స్మిత్ ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 73 టెస్టులు, 125 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 35 సెంచరీలు బాదాడు.

ఐపీఎల్ ఆడుతా:
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదాపడి.. ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరిగితే తాను కచ్చితంగా ఆడతానని స్టీవ్ స్మిత్ ఇటీవలే అన్నాడు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్న స్మిత్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్-మేలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.


Click it and Unblock the Notifications

కంటతడి పెట్టిన నొవాక్ జొకోవిచ్!!










