
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగే ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి పాలైతే ఆ జట్టు కథ ముగిసినట్లేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. అంతేకాకుండా మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరే జట్లను అంచనా వేశాడు. ఇక ఆదివారం దాయాది దేశాల మధ్య రసవత్తర పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ ఫైట్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్లో టీమిండియా ఆటగాళ్లు రాణించడంతో పాటు వామప్ మ్యాచ్ల్లోనూ అదరగొట్టడంతో భారత్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
మరోవైపు ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్పై టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. ఈ మెగా మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన బ్రాడ్ హగ్.. భారత్ జట్టు సెమీఫైనల్ చేరుతుందని అంచాన వేశాడు. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ పేర్లను, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ పేర్లను బ్రాడ్ హగ్ సూచించాడు. అయితే, తొలి మ్యాచ్లో పాకిస్తాన్ టీమింయా చేతిలో ఓటమిపాలైతే మాత్రం తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలవాల్సి ఉంటుందన్నాడు. ఆ మ్యాచే దాయాది జట్టు సెమీస్కు చేరుతుందా లేదా అనేది నిర్ణయిస్తుందని తెలిపాడు. టీమిండియా తొలి మ్యాచ్లో ఆధిపత్యం చలాయిస్తే పాక్ తర్వాతి మ్యాచ్ల్లో రాణించడం కష్టమని హాగ్ అభిప్రాయపడ్డాడు.
'భారత్ చేతిలో పాక్ ఓడితే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. తరువాతి మ్యాచ్లో పాక్.. న్యూజిలాండ్ను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచే ఆ జట్టు భవితవ్యాన్నితేల్చుతుంది. అయితే భారత్ను ఓడిస్తే మాత్రం పాక్కు తిరుగుండదు. ఓడితే మాత్రం పాక్ ముందంజ వేయలేదనేది నా అభిప్రాయం. ఏం జరుగుతుందో చూద్దాం. నా అంచనా ప్రకారం గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సెమీస్ చేరితే.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్కు అవకాశం ఉంటుంది.'అని హగ్ చెప్పుకొచ్చాడు.
కాగా, గ్రూప్-2లో ఉన్న భారత్, పాక్ జట్లు సూపర్-12 దశలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్తో పాటు గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బి విజేతలతో మిగతా మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే టీమ్ మొత్తం మ్యాచ్ విన్నర్లున్న టీమిండియా అన్ని జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది.