మంచి టీమ్ దొరికింది..
'రికీ పాంటింగ్కు ఓ అద్భుతమైన టీమ్ దొరికింది. మాథ్యూ హేడెన్, షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, బ్రెట్ లీ.. ఇలా పాంటింగ్ టీమ్లో ప్రతీ ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నరే. అలాగే మహేంద్ర సింగ్ ధోనీకి చాలా గొప్ప టీమ్ ఉండేది. సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్, గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా ధోనీ టీమ్లో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉండేవాళ్లు. ఏ ప్లేయర్ను ఎలా వాడాలో మహేంద్ర సింగ్ ధోనీకి బాగా తెలుసు. అదే అతని సక్సెస్ సీక్రెట్.
ధోనీయే గొప్ప కెప్టెన్..
అయితే రికీ పాంటింగ్తో పోలిస్తే ధోనీయే గొప్ప కెప్టెన్ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే భారత క్రికెట్లో రాజకీయాలు ఎక్కువ. భారత్లాంటి దేశంలో క్రికెట్ టీమ్ను నడిపించాలంటే ఎన్నో ఆటంకాలను, ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ దాటుకుని టీమిండియాని ధోనీ జగజ్జేతగా నిలిచాడు. రికీ పాంటింగ్కు అంత అవసరం ఎప్పుడూ రాలేదు. అతని చుట్టూ ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్లు ఎప్పుడూ తోడుగా నిలిచారు. ఆస్ట్రేలియాలో క్రికెట్లో రాజకీయాలు ఉండవు, ఉన్నా కెప్టెన్పై ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకుంటారు. రికీ పాంటింగ్ కేవలం ఆటను మాత్రమే చూసుకునేవాడు.
ఆ విషయం ధోనీకి బాగా తెలుసు..
ప్లేయర్ల యాటిట్యూడ్ గురించి, వారి ప్రవర్తన గురించి రికీ పాంటింగ్కి బాగా తెలుసు. అలాగే ప్లేయర్ల బలా బలాలు కూడా అంచనా వేసేవాడు. మాహీకి కూడా ఇవన్నీ తెలుసు. అయితే ఫలానా ప్లేయర్నే ఆడించాలనే రాజకీయ ఒత్తుడులు కూడా ఉండేవి. వాటిని దాటి టైటిల్ గెలవడం మామూలు విషయం కాదు... అందుకే రికీ కంటే ధోనీ గొప్ప కెప్టెన్'అని బ్రాడ్ హగ్ అన్నాడు.