For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొంపముంచిన బౌలర్లు.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియాకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచితే.. తాజా మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోయారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు.

మంధాన, ప్రతికా విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. హర్లీన్ డియోల్(42 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38), రిచా ఘోష్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), జెమీమా రోడ్రిగ్స్(21 బంతుల్లో 5 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు.

Bowling and Lower-Order Collapse Cost India Dearly Against Australia in Women s World Cup 2025

లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో 7 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆలౌటైంది. లేదంటే భారత్ 350 ప్లస్ స్కోర్ చేసేది. అమన్ జోత్ కౌర్(16), దీప్తి శర్మ(1), క్రాంతి గౌడ్(1), శ్రీచరణి(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నబెల్ సదర్లాండ్(5/40) ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. సోఫీ మోలినక్స్(3/75) మూడు వికెట్లు తీయగా.. మేఘన స్కట్, అష్లే గార్డ్‌నర్ చెరో వికెట్ పడగొట్టారు.

కొంపముంచిన క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా..

అనంతరం ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ అలీసా హీలీ(107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 142) భారీ శతకంతో చెలరేగగా.. ఫోబీ లిచి‌ఫీల్డ్(40), ఎల్లీస్ పెర్రీ(47 నాటౌట్), అష్లే గార్డ్‌నర్(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి(3/41) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అమన్‌జోత్ కౌర్(2/75), దీప్తి శర్మ(2/52) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్(0/73), స్నేహ్ రాణా(0/85) ధారళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై భారత బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయలేకపోయారు. పరుగులను కట్టడి చేయలేక ఓటమికి తలవంచారు.

సెమీస్ ఛాన్స్ సంక్లిష్టం..

ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 విజయాలు 2 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్.. తదుపరి మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు మూడు గెలిస్తేనే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా సెమీస్‌కు అర్హత సాధిస్తోంది.

Story first published: Monday, October 13, 2025, 6:50 [IST]
Other articles published on Oct 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+