హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ జట్ల తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్న ప్రేక్షుకలను ఔరా అనిపించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. మెక్లీన్గన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్కు సంధించగా, దానిని డీకాక్ భారీ షాట్గా మలిచే యత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బంతి కింద పడిపోయే క్రమంలో రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు.
దీనికి ఫీల్డ్ అంపైర్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో రోహిత్ శర్మ థర్డ్ అంపైర్ నిర్ణయం కోరాడు. రీప్లేలో తక్కువ ఎత్తులో క్యాచ్ అందుకున్నట్లు కనబడటంతో డీకాక్ (7) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 38 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ను కోల్పోయింది.
ఆ తర్వాత దూకుడుగా ఆడిన వోహ్రా (31 బంతుల్లో 45)ను మార్కండే ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు 8.4 ఓవర్లలో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన పదో ఓవర్లో మెక్కల్లమ్ వరుసగా రెండు సిక్స్లతోపాటు బౌండరీ బాదడంతో ఒకే ఓవర్లో 20 పరుగులు రాబట్టారు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో మెక్కల్లమ్ (23), కోహ్లీ(3) పరుగులతో ఉన్నారు.