For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే జరిగితే మహమ్మద్ షమీ ప్రపంచకప్ జట్టులోకి వస్తాడు: బీసీసీఐ సెలెక్టర్

 BCCI selector says Mohammed Shami can still walk into India T20 WC Squad but few conditions applied

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా గతేడాదిగా కొనసాగిస్తున్న జట్టునే ఎంపిక చేసింది. గాయాలతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రీఎంట్రీ ఇవ్వగా.. గాయంతో దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ అవకాశం అందుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియా వేదికగా మెగా టోర్నీ జరుగుతుండటంతో మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని స్టాండ్‌బై ప్లేయర్‌గా ప్రకటించడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. షమీని తుది జట్టులోకి తీసుకోవాల్సిందనే డిమాండ్ వినిపించింది.

అదే జరిగితే జట్టులోకి మహమ్మద్ షమీ..

అదే జరిగితే జట్టులోకి మహమ్మద్ షమీ..

అయితే ఇదే విషయంపై ఓ బీసీసీఐ సెలెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా.. దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని తెలిపాడు. గాయాలతో జట్టుకు దూరమై రీఎంట్రీ ఇస్తున్న హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు బ్యాకప్‌గా అతన్ని తీసుకున్నామని చెప్పాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న అప్‌కమింగ్ సిరీస్‌ల్లో ఈ ఇద్దరిలో ఎవరూ విఫలమైనా.. మహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడని చెప్పాడు.

అంతేకాకుండా.. మహమ్మద్ షమీ సైతం తన సత్తా ఏంటో ఈ సిరీస్‌ల ద్వారా చూపించుకోవాల్సి ఉంటుందన్నాడు. గత 10 నెలలుగా అతను టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడని, అతని సామర్థ్యాన్ని కూడా ఈ సిరీస్‌లో పరీక్షిస్తామని చెప్పాడు.

దేనికైనా ఓ విధానం ఉంటుంది..

దేనికైనా ఓ విధానం ఉంటుంది..

'10 నెలల పాటు టీ20లు ఆడని ఏ ప్లేయర్‌నైనా నేరుగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేం. ఆటగాడిని ఎంపిక చేసే విషయంలో ఓ విధానాన్ని అనుసరిస్తాం. మహమ్మద్ షమీ గైర్హాజరీలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు. దాంతోనే అతనికి అవకాశం దక్కింది. అయితే హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాల గాయాలపై సందేహాలున్నాయి. వారు పూర్తిగా కోలుకోకుంటే షమీ జట్టులోకి వస్తాడు. అతను కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది'అని సదరు సెలెక్టర్ పేర్కొన్నాడు. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే షమీకి టీ20ల్లో ఆడించమని చెప్పామని, ఆ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టామని క్లారిటీ ఇచ్చాడు.

 రోహిత్ వద్దనడంతోనే

రోహిత్ వద్దనడంతోనే

అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వద్దనడంతోనే మహమ్మద్ షమీని స్టాండ్‌బై ఎంపిక చేసారనే ప్రచారం జరిగింది. 15 మందితో కూడిన ఈ జట్టులోకి 14 మంది పేర్లని ఏకాభిప్రాయంతో ఖాయం చేసిన సెలెక్టర్లు.. 15వ ప్లేయర్ ఎంపిక నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి వదిలేసినట్లు తెలిసింది. సెలెక్షన్ కమిటీ మీటింగ్‌కి ఈ ఇద్దరు కూడా హాజరయ్యారు. 15వ ప్లేయర్ రేసులో మహ్మద్ షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ అభిప్రాయాన్ని సెలెక్టర్లు కోరినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది.

అశ్విన్ కోసం..

అశ్విన్ కోసం..

బాగా ఆలోచించిన రోహిత్ శర్మ.. అశ్విన్‌కే ఓటేసినట్లు సమాచారం. దానికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మద్దతు తెలిపాడట. దాంతో షమీ స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లైనప్‌లో ఉంటే వేరియేషన్ ఉండటంతో పాటు లెప్ట్ హ్యాండర్లను కట్టడి చేయచ్చని రోహిత్ శర్మ భావించినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న తలపడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో, సెప్టెంబర్ 28 నుంచి సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.

Story first published: Saturday, September 17, 2022, 12:41 [IST]
Other articles published on Sep 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+