రోహిత్ టీ20 కెరీర్ ముగిసిందంటూ..
జిన్యూస్ చానెల్ స్ట్రింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసాడు. పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకున్నా టీమిండియా ఆటగాళ్లు ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్లు ఆడుతారని తెలిపాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తనను గుడ్డిగా నమ్ముతారని, టీ20ల్లో హిట్మ్యాన్ కెరీర్ ముగిసిందని తెలిపాడు. తాను యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించానని, దాంతో సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్లో చర్చనీయాంశమయ్యాయి.

రెండోసారి అవకాశం ఇస్తే..
బీసీసీఐ ఈ వ్యవహారంపై అధికారికంగా ఏమీ స్పందించకపోయినా.. చేతన్ శర్మపై చర్యలు తప్పవనిపిస్తోంది. గత ఏడాది కాలంలో తన సెలక్షన్ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇటీవల చేతన్ చీఫ్ సెలక్టర్గా మరోమారు అవకాశం దక్కించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో కమిటీలోని మిగతా సభ్యులందరినీ తప్పించి, ఛైర్మన్ అయిన చేతన్ను మాత్రం బీసీసీఐ కొనసాగించడం చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు చేతన్ ప్రైవేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు భారత క్రికెట్ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి.

మౌనంగా ఉన్నా.. వేటు ఖాయం!
ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించడం ఇబ్బంది కాబట్టి ప్రస్తుతానికి బోర్డు పెద్దలు మౌనం వహిస్తున్నప్పటికీ.. చేతన్పై వేటు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జై షా.. చేతన్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ చైర్మన్గా జట్టు ప్రణాళికలకు సంబంధించిన నిర్ణయాలను బయటకు వెల్లడించడం.. అంతర్గత వ్యవహారలను బయటపెట్టడంపై బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. చీఫ్ సెలెక్టర్ పదవి బాధ్యతల నుంచి చేతన్ శర్మను తప్పించవచ్చని హింట్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












