For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India T20 WC Squad: జస్‌ప్రీత్ బుమ్రా భవితవ్యం తేలేది ఆ రోజే!

BCCI says Jasprit Bumrah likely to travel with India squad, decision on his inclusion by October 15

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరం కాలేదని, అతను జట్టుతో పాటు వెళ్లే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతని వెన్ను నొప్పికి సర్జరీ అవసరం లేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యుల చెప్పారని, అక్టోబర్ 15న బుమ్రా భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి. ఇక వెన్ను నొప్పితో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు దూరమైన బుమ్రా.. ప్రపంచకప్ కూడా ఆడలేడని, అతని వెన్ను ఫ్రాక్చర్ అయిందని, సుమారు నాలుగు నెలల విశ్రాంతి అవసరమని ప్రచారం జరిగింది. బుమ్రా సైతం సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడలేదు. అంతేకాకుండా ఎన్‌సీఏకు మరోసారి రిహాబిలిటేషన్‌కు వెళ్లడంతో అంతా అతను దూరమయ్యారని భావించారు.

 ఎవడు చెప్పిండు..

ఎవడు చెప్పిండు..

అయితే బుమ్రా ప్రపంచకప్ ఆడటం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బుమ్రా గాయపడటం నిజమే అయినప్పటికీ- అతను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇంకా వైదొలగలేదన్నాడు. బుమ్రా గాయం నేపత్యంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పాడు. బుమ్రా ఆడటం లేదని ఎవరు చెప్పారంటూ మీడియాపై అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఎన్‌సీఏ నుంచి పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాతే బుమ్రా విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశాడు. ఇక బుమ్రా గాయం తీవ్రత ఏంటి? ఎలాంటి గాయమైందనే ప్రశ్నలకు గంగూలీ సమాధానాలు చెప్పలేదు.

 అక్టోబర్ 15న తుది నిర్ణయం

అక్టోబర్ 15న తుది నిర్ణయం

బుమ్రా గాయం గురించి ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి.. జట్టుతోనే బుమ్రా ఆస్ట్రేలియాకు వెళ్తాడని, అక్టోబర్ 15న అతని గాయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. 'బుమ్రాకు విశ్రాంతి అవసరం. అతని బ్యాక్ ఇంజ్యూరీకి అదే సరైన ఔషదం. ప్రస్తుతం అతను ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఫిజియో నితిన్ పటేల్ అతని గాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. మేం ఇప్పుడే అతన్ని టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించాలనుకోవడం లేదు. అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియా కూడా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా అతని గాయం రికవరీ ప్రాసెస్ కొనసాగనుంది. అక్టోబర్ 15 వరకు వేచి చూసి ఆ రోజే తుది నిర్ణయం తీసుకుంటాం'అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.

 అక్టోబర్ 6న..

అక్టోబర్ 6న..

ఇక అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ ముగిసిన రెండు రోజులకు అక్టోబర్ 6న టీమిండియా ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. పెర్త్‌లో మెగాటోర్నీ కోసం సన్నదమవ్వనుంది. బుమ్రా కూడా జట్టుతో వెళ్లనుండగా.. అతనితో రిహాబ్ టీమ్‌ కూడా ఉండనుంది. అక్టోబర్ 15లోపు అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోతే.. ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే స్టాండ్ బై జాబితాలో కొత్తగా ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్‌లకు అవకాశం కల్పించింది. ఈ ఇద్దరితో పాటు స్టాండ్ బైగా ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్ కూడా జట్టుతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

Story first published: Saturday, October 1, 2022, 16:28 [IST]
Other articles published on Oct 1, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+