
రెండు టీ20 సిరీస్లు
భారత గడ్డపై అక్టోబరు-నవంబరు నెలలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్కప్ వరకూ కోహ్లీసేన మళ్లీ టీ20లు ఆడే అవకాశం దాదాపు లేదు. అలా అయితే మెగా టోర్నీలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో రెండు టీ20 సిరీస్లను బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. మెగా టోర్నీ ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడితే.. టీమిండియాకి మంచి ప్రాక్టీస్ దొరకనుంది.

బీసీసీఐ చర్చలు
'మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టీ20 సిరీస్ కోసం భారత్ గడ్డపైకి రానున్నాయి. ఇరు దేశాల క్రికెట్ బోర్డులతో బీసీసీఐ చర్చలు జరిపింది. బీసీసీఐ ప్రతిపాదనకు వారు సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అధికారికంగా అంగీకరించే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా పూర్తిగా టచ్లోకి రావాలనేది బీసీసీఐ ముఖ్య ఉద్దేశం' అని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో అన్నారు.

నో చెప్పేందుకు సాహసించకపోవచ్చు
నిజానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ గడ్డపై టీ20 సిరీస్ ఆడాలనే అగ్రిమెంట్.. గత ఏడాది నుంచి అలానే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ టీ20 సిరీస్ వాయిదా పడింది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ పర్యటనకి న్యూజిలాండ్ రాబోతోంది. అయితే ప్రపంచకప్ కంటే ముందే కివీస్ను రప్పించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాఫ్రికా గడ్డపైకి ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు వెళ్లనుండటంతో.. బీసీసీఐ ప్రతిపాదనకి నో చెప్పేందుకు ప్రొటీస్ సాహసించకపోవచ్చు. కేవలం మనకే కాదు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు కూడా ఈ టీ20 లాభించనుంది.
India vs England: అదేమైనా బ్యాటింగ్ ఆర్డరేనా.. టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డ మైకేల్ వాన్!!


Click it and Unblock the Notifications
