ముంబై : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లన్నిటినీ కేవలం మూడు స్టేడియాల్లోనే నిర్వహించనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగు టెస్ట్లు, ఐదు టీ20లు, మూడు వన్డేలకు చెన్నై, అహ్మదాబాద్, పుణెలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి టెస్టు మ్యాచ్ చె ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ప్రారంభంకానుంది.
ఇక చివరిసారి గతేడాది జనవరిలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్నే ప్రేక్షకులు మైదానాల్లోకి వెళ్లి వీక్షించారు. ఆ తర్వాత కరోనా సంక్షోభం మొదలవడంతో భారత్లో మ్యాచ్లు జరగలేదు. ఐపీఎల్ 2020 సీజన్ను కూడా ప్రేక్షకుల్లేకుండా యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. ఇక దేశవాలి టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్న విషయం తెలిసిందే.