ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా... ఈ నెలాఖరులో శ్రీలంక టూర్కు వెళ్లనుంది. శ్రీలంక గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను గురువారం ప్రకటించింది.
ఈ నెల 26 నుంచి మూడు టీ20ల సిరీస్, ఆగస్ట్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2.30కు మొదలవ్వనున్నాయి. ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తన బాధ్యతలను చేపట్టనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లు ఈ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడటంపై క్లారిటీ లేదు. ఈ ఇద్దరికి ఈ పర్యటన నుంచి కూడా విశ్రాంతి కల్పిస్తే హార్దిక్ పాండ్యా జట్టును నడిపించే అవకాశం ఉంది.
శ్రీలంకతో టీ20 సిరీస్
తొలి టీ20: జూలై 26, పల్లెకెలె
రెండో టీ20: జూలై 27, పల్లెకెలె
మూడో టీ20: జూలై 29, పల్లెకెలె
శ్రీలంకతో వన్డే సిరీస్
తొలి వన్డే: ఆగస్ట్ 1, కొలంబో
రెండో వన్డే: ఆగస్ట్ 4, కొలంబో
మూడో వన్డే: ఆగస్ట్ 1, కొలంబో