
కొత్తగా 19 ప్లస్ టీమ్...
తద్వారా అండర్ 19 ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత ఈ యంగ్ స్టర్స్ డెవలప్మెంట్ను మానిటర్ చేసి వాళ్లు సీనియర్ టీమ్లోకి వచ్చేలా గైడెన్స్ ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా అండర్-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. తాజా అండర్-19 ప్రపంచకప్లో సత్తా చాటిన షేక్ రషీద్ (ఆంధ్ర), రవి కుమార్ (బెంగాల్), రాజ్ అంగద్ బవా (చండీగఢ్), యశ్ ధుల్ (దిల్లీ)కు నేరుగా రంజీ జట్టులో చోటు దక్కొచ్చు. కానీ ప్రస్తుత జట్టులోని చాలా మంది అండర్-19 తదుపరి దశ, రంజీ ట్రోఫీకి మధ్య ఎటూ గాని స్థితిలో ఉండే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలో అండర్-25 విభాగం ఉంది. కానీ జట్లలోని కొన్ని స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది.

అయిదు అంచెల వ్యవస్థ..
‘సీనియర్ భారత జట్టు కోసం ఆటగాళ్లను సిద్ధం చేయడం కోసం ఎన్సీఏ భవిష్యత్తులో అయిదు అంచెల వ్యవస్థపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ వ్యవస్థలో మొదట అండర్-16, ఆ తర్వాత అండర్-19, ఎమర్జింగ్ (జాతీయ అండర్-23), ఎ జట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు 19+ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ విభాగంలో ఈ కుర్రాళ్లందరినీ కలపొచ్చు'' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ విభాగాలన్నింటిలో బీసీసీఐ అండర్-25 (రాష్ట్ర 'ఎ'జట్టు) సీనియర్ స్థాయికి వెళ్లలేని ఆటగాళ్లకు వేదికలా ఉపయోగపడుతోంది.

అకాడమీలోనే ..
ఇప్పటికీ ఫస్ల్క్లాస్ క్రికెట్ క్రమం తప్పకుండా ఆడని 23-24 ఏళ్ల ఆటగాళ్లలో చాలా మంది సీనియర్ గ్రేడ్కు వెళ్లలేకపోవచ్చని కోచ్లకు తెలుసు. ఈ నేపథ్యంలో అండర్-19, ఫస్ట్క్లాస్ క్రికెట్కు మధ్య వారధి అవసరం. నాలుగు ఫస్ట్క్లాస్ స్థాయి మైదానాలతో కొత్త ఏన్సీఏ వాడుకలోకి వచ్చిందంటే.. అకాడమీ తన సొంత అండర్-19+ జట్లను కలిగి ఉండొచ్చు. తమలో తామే ఆడుతూ ఉండే ఈ జట్ల పురోగతిని కోచ్లు, ట్రెయినర్లు, ఫిజియోలు పర్యవేక్షించవచ్చు. వాళ్లు పై గ్రేడ్కు వెళ్లి రాష్ట్ర 'ఎ' జట్టు (అండర్-25) ఆడితే లేదా రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించవచ్చు. ఏ జట్టుకూ ఎంపిక కాకపోతే కనీసం ఎన్సీఏ పరిధిలోనైనా ఉంటారు.

త్వరలోనే ఓ బ్లూ ప్రింట్..
ఈ విషయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ చీఫ్ వీ లక్ష్మణ్తో కలిసి నేషనల్ జూనియర్, సీనియర్ టీమ్ సెలెక్టర్లతో సమావేశమై ఓ బ్లూ ప్రింట్ను తయారు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది.‘అండర్-19 ప్రపంచకప్పుతో మనమంతా పొంగిపోతున్నాం. మనకు గొప్ప వ్యవస్థ ఉంది. అందు వల్లే మన జూనియర్ జట్లు ప్రపంచ స్థాయిలో ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటున్నాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ వచ్చేసరికే తేడా వస్తోంది. 2012 అండర్-19 జట్టునే తీసుకోండి. హనుమ విహారి ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లెక్కడున్నారో తెలియదు. అందులో చాలా మంది కనీసం తమ తమ రాష్ట్రాల్లో అత్యుత్తమ దేశవాళీ ఆటగాళ్లుగా కూడా లేరు'అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అన్నాడు.


Click it and Unblock the Notifications












