న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆడేందుకు ముస్తాఫిజుర్‌‌కు అనుమతి నిరాకరించిన బంగ్లా క్రికెట్ బోర్డు

Bangladesh Cricket Board denies NOC to Mustafizur Rahman after being approached by IPL franchises

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌కు ఐపీఎల్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అనుమతి నిరాకరించింది. ఈ పేసర్‌ కోసం ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు ప్రయత్నించాయి. అయితే వచ్చేనెలలో శ్రీలంకలో బంగ్లాదేశ్‌ జట్టు పర్యటించాల్సి ఉండడంతో ఐపీఎల్‌లో ఆడేందుకు ముస్తాఫిజుర్‌కు 'నిరభ్యంతర పత్రం' ఇచ్చేందుకు నిరాకరించినట్టు ఆ బోర్డు క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ఖాన్‌ చెప్పినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది.

ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్‌ పేసర్‌ లసిత్‌ మలింగ దూరం కాగా.. అతని స్థానంలో ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ పాటిన్‌సన్‌ను తీసుకుంది. అయితే, అంతకుముందు ఈ బంగ్లా పేసర్‌పై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ప్లేయర్‌ హ్యారీ గార్నీ తప్పుకోవడంతో అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టు కూడా ముస్తాఫిజుర్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇక 2018లో చివరిసారిగా ఐపీఎల్‌ ఆడిన ముస్తాఫిజుర్‌.. ముంబై ఇండియన్స్‌ తరఫున 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. మధ్యలో గాయమవ్వడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది కూడా అతడు ఐపీఎల్‌లో ఆడడానికి బంగ్లా బోర్డు నిరాకరించింది. విదేశీ లీగుల్లో ఆడితే తమ ఆటగాళ్లు అనవసరంగా గాయాలబారిన పడతారని భావించి ఆ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం లేదు.

CPL 2020: చెలరేగిన బ్రావో బ్రదర్స్.. నైట్‌రైడర్స్‌ సూపర్ విక్టరీ!CPL 2020: చెలరేగిన బ్రావో బ్రదర్స్.. నైట్‌రైడర్స్‌ సూపర్ విక్టరీ!

Story first published: Sunday, September 6, 2020, 15:34 [IST]
Other articles published on Sep 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X