
మెరిసిన మెండీస్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కుశాల్ మెండీస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీ చేయగా.. డసన్ షనక(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలండర్లు సైతం విలువైన పరుగులు చేయడంతో ఆ జట్టు విజయాన్నందుకుంది. ముఖ్యంగా ఫెర్నాండో(10 నాటౌట్) విజయం కావాల్సిన పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ఎబడాట్ హోస్సెన్ మూడు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్ రెండు పడగొట్టాడు. ముస్తాఫిర్ రెహ్మాన్, మెహ్దీ హసన్ చెరొక వికెట్ పడగొట్టారు.
శుభారంభం..
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(20), కుశాల్ మెండీస్ శుభారంభం అందించారు. 45 పరుగులు జోడించిన అనంతరం తొలి వికెట్గా నిస్సంక వెనుదిరిగాడు. ఎబడాట్ హోస్సెన్ వేసిన ఆరో ఓవర్లో అతను క్యాచ్ ఔటయ్యాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన అసలంక(1) ఔటవ్వడంతో పవర్ ప్లే ముగిసేసరికి లంక 2 వికెట్ల నష్టానికి 48 రన్స్ చేసింది. ఇక తన మరుసటి ఓవర్లో ఎబడాట్ హోస్సెన్.. దనుష్క తిలక(11)ను ఔట్ చేశాడు.

గెలిచే మ్యాచ్లో..
ఆ తర్వాత భానుక రాజపక్సను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కుశాల్ మెండీస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అతన్ని ముస్తాఫిజుర్ రెహ్మాన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా(2)ను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కెప్టెన్ డసన్ షనక ఒంటరి పోరాటం చేశాడు. అయితే మెహ్దీ హసన్ అతన్ని క్యాచ్ ఔట్ చేయడంతో లంక విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో 16 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్లో నో బాల్ వేసిన బంగ్లాదేశ్ మూల్యం చెల్లించుకుంది. ఫెర్నాండో రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో లంక బౌలర్లు నాగినీ డ్యాన్స్ చేసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నారు.


Click it and Unblock the Notifications
