
షకీల్ ఔట్ కావడం వల్లే..
'షకీల్ ఔటే మా ఓటమికి కారణం. అతను ఇచ్చిన క్యాచ్ను ఇంగ్లండ్ కీపర్ పోప్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ ప్రొఫెషనల్ క్రికెటర్గా అంపైర్ నిర్ణయాన్ని గౌరవించాలి. తొలి ఇన్నింగ్స్లో మేం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ రెండో ఇన్నింగ్స్లో బంతితో పాటు బ్యాట్తో రాణిచాం. కానీ అది సరిపోలేదు. కొన్ని మంచి భాగస్వామ్యాలు లభించినా విజయాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్ విభాగం వైఫల్యం జట్టు ఓటమిని శాసించింది. అరంగేట్ర స్పిన్నర్ అబ్రర్ అదరగొట్టాడు. పిచ్ కండిషన్స్ను అద్భుతంగా వాడుకున్నాడు. కరాచీ టెస్ట్లోనైనా విజయం కోసం పోరాడుతాం'అని బాబర్ చెప్పుకొచ్చాడు.
తోసిపుచ్చిన పోప్..
ఇక తన గ్లోవ్స్లోకి పడకముందే బంతి నేలను తాకిందన్న వాదనను ఇంగ్లండ్ కీపర్ పోప్ తోసిపుచ్చాడు. ''నా గ్లోవ్స్లోకి రాక ముందే బంతి బౌన్స్ అయిందని అనుకోవట్లేదు. బంతి నేరుగా గ్లోవ్స్లోకే వెళ్లినట్లు అనిపించింది. గ్లోవ్స్ వేసుకున్న కీపర్కు బంతి నేలకు తాకిందా లేదా చెప్పడం కష్టమే.'' అని పోప్ తెలిపాడు. 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. సౌద్ షకీల్(213 బంతుల్లో 8 ఫోర్లు 94) అసాధారణ బ్యాటింగ్తో విజయం దిశగా సాగింది. అయితే సెంచరీకి చేరువైన షకీల్.. మార్క్ వుడ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే ఈ ఔట్ వివాదాస్పదమైంది.

నేలకు తాకిన బంతి..
లెగ్ స్టంప్ టార్గెట్గా మార్క్ వుడ్ వేసిన బంతిని షకీల్ ఫైన్ లెగ్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది కాస్త అతని బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ పోప్ చేతిలో పడింది. అయితే బంతిని పోప్ అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు అనిపించింది. కానీ స్పష్టంగా కనిపించడం లేదని చెప్పిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటివ్వడంతో ఔటిచ్చాడు. అయితే నేలకు తాకినట్లు కనిపిస్తున్నా.. అంపైర్ ఎందుకు ఔటివ్వలేదనే చర్చ తెరమీదకు వచ్చింది. షకీల్ ఔటవ్వడం.. పాకిస్థాన్ ఓటమిపాలవ్వడంతో ఈ వికెట్ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.

ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయం..
రెండో ఇన్నింగ్స్లో పాకిస్థాన్ 328 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్(4/65) నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మహమ్మద్ నవాజ్(62 బంతుల్లో 7 ఫోర్లతో 45)తో కలిసి సౌద్ షకీల్ చేసిన పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 21 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 281 పరుగులకు ఆలౌటవ్వగా.. పాకిస్థాన్ 202 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో 275 పరుగులు చేసిన ఇంగ్లండ్.. పాకిస్థాన్ను 328 పరుగులకు ఆలౌట్ చేసి విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications












