
ఇప్పటి నుంచి ఓ లెక్క..
ఇక ఈ మెగా మ్యాచ్ నేపథ్యంలో బాబర్ ఆజామ్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మెగా టోర్నీల్లో తమపై భారత్ గెలిచిందనేది వాస్తవేమనని, కానీ అది గతమని, ఇప్పటి నుంచి ఒక లెక్కా! అని బాబర్ భారీ డైలాగ్స్ కొట్టాడు. 'పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. మనపై మనకు గట్టి నమ్మకం ఉండాలి. జట్టుగా మేం రెట్టించి ఉత్సాహంతో ఉన్నాం. ఇప్పటివరకు ప్రపంచకప్ వేదికగా టీమిండియాను ఓడించలేదనేది వాస్తవం. కానీ అదంతా గతం. దాని గురించి మాకు అనవసరం. భవిష్యత్తు గురించే మా ఆలోచనంతా. అక్టోబర్ 24న జరగనున్న మ్యాచ్లో మంచి క్రికెట్ ఆడేందుకు బాగా సన్నదమయ్యాం.

భారత్ను ఓడిస్తాం..
భారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్రతతో కూడుకున్నది. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ పరిస్థితులను, ఒత్తిడిని అధిగమించేందుకు అన్ని రకాలుగా సిద్దమయ్యాం. మ్యాచ్లో మేం ప్రశాంతంగా ఉంటూ క్రికెట్పైనే దృష్టిపెట్టాల్సి అవసరం ఉంది. యూఏఈ పరస్థితులు మాకు బాగా తెలుసు. గత మూడు, నాలుగేళ్లుగా మేం ఇక్కడ క్రికెట్ ఆడాం. ఇక్కడి వికెట్లు ఎలా ఉంటాయో, పరిస్థితులకు తగ్గట్లు బ్యాట్స్మెన్ ఎలా ఆడాలో మాకు అవగాహన ఉంది. మ్యాచ్ జరిగే రోజు ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం. మా లక్ష్యం మాత్రం గొప్పగా ఆడటం. ఎవరు గెలుస్తారనే మీరు అడిగితే మాత్రం మేమే గెలుస్తామని చెబుతా. విజయానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు రచించుకున్నాం. మా దగ్గర ఉన్న అస్త్ర శ్రస్తాలతో టీమిండియాతో మ్యాచ్కు బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా విజయం మాదే అవుతుంది.'అని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు.

12-0తో భారత్దే ఆధిపత్యం..
మెగా టోర్నీల్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు భారత్ను ఓడించలేకపోయింది. టీ20 ప్రపంచకప్లో ఐదు సార్లు తలపడగా ఐదింటికి ఐదు ఇండియానే గెలిచింది. వన్డే ప్రపంచకప్లో ఏడు సార్లు తలపడగా ఏడింటిలోనూ భారతే విజయం సాధించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. రెండు సార్లు టీమిండియా.. మూడుసార్లు పాకిస్తాన్ విజయం సాధించింది. ఇందులో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా ఉంది. తాజా మ్యాచ్ విజయంతో ఈ ఆధిపత్యాన్ని భారత్ 13-0గా మారుస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టులో అంతా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని సునాయసంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications
