హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్డెవిల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఆటగాడు అవీష్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్లో భాగంగా ఐదో ఓవర్ను ఢిల్లీ బౌలర్ ప్లంకెట్ వేశాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఆ ఓవర్ మూడో బంతిని పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ షార్ట్ ఫైన్లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అవేశ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్గా అందుకున్నాడు. తొలుత బంతి గమనాన్ని అంచనా వేసిన అవేశ్ ఖాన్ బంతి నేలను తాకే క్రమంలో చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు.
దీంతో పంజాబ్ 42 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ శ్రేయస్ అయ్యార్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత కాస్త దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ ప్లంకెట్ వేసి ఐదో ఓవర్ మూడో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అవేశ్కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో కరుణ్ నాయర్, మయాంక్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ ప్లంకెట్ బౌలింగ్లో మయాంక్(21) క్లీన్ బౌల్డ్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మళ్లీ ప్లంకెట్ బౌలింగ్లో కరుణ్ నైర్(34) పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్మన్ ఎవరూ పెద్దగా రాణించక పోవడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 144 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో ప్లంకెట్ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్, అవేశ్ ఖాన్ చెరి రెండు వికెట్లు తీశారు. క్రిస్టెయిన్కు ఒక వికెట్ లభించింది.