
బీసీసీఐకి భారీ షాక్
సరిహద్దు వివాదం కారణంగా 'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటంతో.. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్గా ఉండలేమని చైనాకు చెందిన మొబైల్ సంస్థ 'వివో' ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. చివరికి డ్రీమ్ 11కు టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కాయి. అయితే వివో చెల్లించే దాంట్లో సగం ధరకే డ్రీమ్11 హక్కులు దక్కించుకుంది. ఇక టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకున్న బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్షిప్ నుంచి 'ఫ్యూచర్ గ్రూప్' తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాం:
'టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా.. ఎలాంటి ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాం. జరిమానా చెల్లించినట్లయితేనే బీసీసీఐ దీనికి అంగీకరిస్తుంది' అని ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు. ఐపీఎల్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు కూడా ధృవీకరించారు.

పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది:
'ఐపీఎల్ ఒప్పందం నుండి ఫ్యూచర్ గ్రూప్ వైదొలిగింది. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుంది. కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇక 26 రోజులు మాత్రమే ఉంది. ఈ తరుణంలో స్పాన్సర్షిప్ సమస్యలు బోర్డును మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే ఈ సంవత్సరం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ వైదొలగడం వారిని మరింత కష్టాల్లోకి నెట్టనుంది. ఈ సంస్థ ఐపీఎల్తో ఐదేళ్ల పాటు ఒప్పందం కలిగి ఉంది. ఫ్యూచర్ గ్రూప్ వైదొలిగిన తరువాత.. టోర్నమెంట్ అధికారిక స్పాన్సర్ల జాబితా నుండి బీసీసీఐ ఆ సంస్థ పేరును తొలగించింది.


Click it and Unblock the Notifications

IPL 2020: దుబాయ్ లైఫ్.. వీడియో షేర్ చేసిన రైనా!!










