
హాంకాంగ్ ఓడితే...
గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే పాకిస్థాన్ను ఓడించి టేబుల్ టాపర్ (ఏ-1) బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్ తదుపరి మ్యాచ్ల్లో రేపు( ఆగస్ట్ 31న) టీమిండియా, హాంకాంగ్ జట్లు.. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. పై రెండు మ్యాచ్ల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. పసికూన హాంగ్కాంగ్ గెలిచే అవకాశం లేదు. ఈ లెక్కన గ్రూప్-ఏలో తొలి స్థానంలో భారత్.. రెండో స్థానాన్ని పాకిస్థాన్ కైవసం చేసుకోనుంది. ఇదే జరిగితే సెప్టెంబర్ 4న మరోసారి భారత్ X పాక్ మ్యాచ్ చూడవచ్చు.

ఫైనల్లో కూడా..
అంతా సవ్యంగా జరిగితే సూపర్-4 దశలోనే కాకుండా టోర్నీ ఫైనల్లోనూ ఇరు జట్ల తుపాకులు తూటాలు లేని యుద్దాన్ని చూడవచ్చు. అది ఎలా అంటే.. సూపర్-4కు చేరిన జట్లు తమ గ్రూప్లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్లోని (గ్రూప్-బి) తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లతో (బి1, బి2) ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఒక్కో జట్టు మూడు మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక సూపర్-4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 11న (ఆదివారం) ఫైనల్లో తలపడతాయి. ఆయా జట్ల ప్రస్తుత ఫామ్ను పరిశీలిస్తే.. సూపర్-4లో భారత్, పాక్ జట్లకే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అభిమానులకు పండుగే పండుగ..
ఇదే జరిగితే.. భారత్, పాక్లు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే రెండు ఆదివారాలు (సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 11) భారత్, పాక్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ఇదే జరిగితే టీ20 ప్రపంచకప్ ముందు భారత్కు అసలు సిసలు ప్రాక్టీస్ లభించనుంది. ఈ మూడు మ్యాచ్ల్లో గనుక భారత్ గెలిస్తే ఆటగాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించనుంది. మరి రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications
