
ఇదే తొలిసారి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా తనయ జాహ్నవి మెహతా ఐపీఎల్ 2021లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ వేలంలో పాల్గొనడం ఇదే తొలిసారి. కోల్కతా నైట్రైడర్స్ ప్రాంచైజీకి షారుఖ్, జూహీ భర్త జై మెహతా సహ యజమానులు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా గురువారం జరిగిన ఈ క్యాష్ రిచ్ లీగ్ మినీ వేలంలో తండ్రి జై మెహతాతో పాటు జాహ్నవి కూడా పాల్గొన్నారు. తద్వారా వేలంలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలి (19)గా నిలిచారు.

యంగెస్ట్ బిడ్డర్గా
తన కుమార్తె వేలంలో పాల్గొనడంతో జూహీ చావ్లా ఆనందంలో తేలిపోయారు. 'కోల్కతా నైట్రైడర్స్ కిడ్స్ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆర్యన్ ఖాన్, జాహ్నవి మెహతా వేలం పాటలో పాల్గొన్నారు' అని ట్వీట్ చేశారు. తన కూతురు జాహ్నవి, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. 'ఐపీఎల్ వేలం చరిత్రలో యంగెస్ట్ బిడ్డర్గా మా జాహ్నవి మెహతా. చెన్నై పర్యటన, ఈవెంట్కు సంబంధించిన విశేషాలు ఆమె అందిస్తున్నారు' అంటూ కేకేఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఆర్యన్, జాహ్నవి ఫొటో వైరల్
కేకేఆర్ ట్వీట్పై స్పందించిన జూహీ చావ్లా పుత్రికోత్సాహంతో పొంగిపోతూ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యన్, జాహ్నవి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'వీళ్లిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చేసింది' అంటూ కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూహీ చావ్లా- జై మెహతా దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె జాహ్నవి, కుమారుడు అర్జున్ మెహతా. రూ.10.75 కోట్లతో కేకేఆర్ వేలానికి వెళ్లిన సంగతి తెలిసిందే. షకీబ్ అల్ హసన్, కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

వేలంలో కేకేఆర్ దక్కించుకున్న ఆటగాళ్లు
షకీబ్ అల్ హసన్- రూ. 3.2 కోట్లు
హర్భజన్ సింగ్- రూ. 2 కోట్లు
కరుణ్ నాయర్- రూ. 50 లక్షలు
బెన్ కటింగ్- రూ.75లక్షలు
వెంకటేస్ అయ్యర్- రూ.20లక్షలు
పవన్ నేగి- రూ.50లక్షలు


Click it and Unblock the Notifications

IPL 2021 Auction: నాన్న మాట విని తప్పు చేశా.. అమ్మ మాట వింటే ఇప్పుడు కింగ్ అయ్యేవాడిని: దినేశ్ కార్తిక్










