న్యూఢిల్లీ: దిగ్గజ స్పిన్నర్లు ముత్తయ్య మురళీ ధరన్, షేన్ వార్న్తో తనను పోల్చడం అతిగా ఉంటుందని భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి ఎంబాగ్వాతో ఇన్స్టా లైవ్ సెషన్లో మాట్లాడిన కుంబ్లే.. ఆ ఇద్దరి దిగ్గజాలతో పోల్చడం అతిశయోక్తిగా ఉంటుందన్నాడు.
'మురళీ, షేన్ వార్న్లు ప్రపంచంలో ఎక్కడైనా బంతితో మాయ చేయగలరు. అందులో నాకు కొన్ని పరిమితులున్నాయి. అందుకే వారితో పోల్చడాన్ని నేను అంగీకరించను. ముఖ్యంగా మురళీ నాకంటే ఎప్పుడూ చాలా ముందుండేవాడు. నేను ఓ రికార్డు సాధిస్తే.. ఆ రికార్డు ఎప్పుడో దాటేసి ఉండేవాడు. ఆ తరవాతి రికార్డుకు 20, 30 వికెట్ల దూరంలో ఉండేవాడు.
ఎప్పుడైనా కలిసినప్పుడు అభినందించినా.. క్రికెట్లో తాను సాధించింది చాలా తక్కువని, ఇంకా చాలా ఉందని అనేవాడు. ఇక వార్న్ కూడా మేటి స్పిన్నర్. మా ముగ్గురిలో చక్కటి అనుబంధం ఉండేది' అంటూ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.
ఇక భారత ఆల్టైం బెస్ట్ స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే నెంబర్ వన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని గణంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. టెస్ట్ల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు తీసాడు. భారత్ తరఫున రెండు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా కూడా కుంబ్లే(956) రికార్డు నెలకొల్పాడు.
ఇక పాకీస్తాన్పై ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీయడం అతడి కెరీర్లోనే ఓ పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు. 1999లో న్యూఢిల్లీ వేదికగా పాకిస్థాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కుబ్లే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ కూడా అరుదైన రికార్డులను నెలకొల్పారు.
రేసింగ్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుంది: పోర్న్ స్టార్గా మారిన మహిళా రేసర్!